Adivi Sesh: అడివి శేష్ సరసన శ్రుతి హాసన్‌.. నిర్మాత ఎవరంటే!

అడివి శేష్ (Adivi Sesh) కొత్త సినిమాను ప్రకటించారు. అందులో హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌ను (Shruti Haasan) ఎంపిక చేశారు.

Published : 12 Dec 2023 17:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటారు హీరో అడివి శేష్‌ (Adivi Sesh). గతేడాది ‘మేజర్‌’, ‘హిట్‌2’ లాంటి విజయవంతమైన చిత్రాలతో ఆకట్టుకున్న ఆయన తాజాగా తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ చిత్రంతో షనియల్‌ డియో అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఇది పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్నట్లు తెలిపారు.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రంలో అడివి శేష్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటించనుంది. ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఇక దర్శకుడు షనియల్‌ డియో విషయానికొస్తే.. అడివి శేష్ నటించిన ‘క్షణం’, ‘గూఢాచారి’ లాంటి సినిమాలకు ఆయన పనిచేశారు. ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నారు. గతంలో ఆయన తీసిన ఓ షార్ట్‌ ఫిల్మ్ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు అధికారికంగా ఎంపికైంది. ప్రస్తుతం అడివి శేష్‌ సినిమాకు దర్శకత్వం మాత్రమే కాకుండా స్టోరీ కూడా అందిస్తున్నారు.

రహస్యాలు అడగొద్దు.. నేను అబద్ధాలే చెబుతాను : అనన్యతో డేటింగ్‌పై ఆదిత్యరాయ్‌ కామెంట్‌

ఇక ప్రస్తుతం అడివి శేష్‌ ‘జీ 2’ (Goodachari 2) పనుల్లో బిజీగా ఉన్నారు. 2018లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకుంది. చిత్రానికి ఫ్రాంచైజీగా ‘జీ 2’ తెరకెక్కుతోంది. దీనికి అడివి శేష్ స్వయంగా కథను అందించారు. ఐదు దేశాల్లో ఈ సినిమాను షూట్‌ చేయనున్నారు. ఇందులో శేష్ సరసన బనితా సంధు నటించనుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని