Devara: ‘దేవర’లో మరాఠీ బ్యూటీ.. తన పాత్ర ఏంటో చెప్పేసిన నటి!

ఎన్టీఆర్‌ సరసన నటిస్తున్నట్లు మరాఠీ బ్యూటీ శ్రుతి వెల్లడించారు.

Updated : 22 Mar 2024 20:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్టీఆర్‌ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్‌ డ్రామా ‘దేవర’ (Devara). ఎన్టీఆర్‌ ఊరమాస్‌ అవతారంలో కనిపించనున్న ఈ సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో మరాఠీ బ్యూటీ నటించనుందంటూ కొన్నిరోజుల నుంచి వస్తున్న వార్తలు నిజమయ్యాయి. నటి శ్రుతి మరాఠే  (shruti marathe) ఇందులో నటిస్తున్నట్లు  ఆమె స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే ఇందులో జాన్వీకపూర్‌ తంగం అనే పాత్రలో కనిపించనున్నట్లు మూవీ టీమ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

శ్రుతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ‘దేవర’లో నటిస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా అందరికీ తెలిసింది. ఈ సినిమా అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. అందులో నేను దేవరకు భార్యగా కనిపిస్తాను. ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని చెప్పారు. దీంతో ఇందులో ఇద్దరు హీరోయిన్లు అనే విషయం ఖరారైంది. అలాగే ఇందులో ఎన్టీఆర్‌ (NTR) ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారనే వార్తలకు కూడా బలం చేకూరింది.

‘దేవర’ సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతో జాన్వీ తెలుగు తెరకు పరిచయమవుతుండగా, సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కీలక పాత్రలో శ్రీకాంత్‌ కనిపించనున్నారు. తొలుత ఈ మూవీ మొదటిభాగాన్ని ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల దీని విడుదలను అక్టోబర్‌ 10కి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని