Siddharth: సినిమా చూడలేదనడం సిగ్గుచేటు..స్టేజ్‌పై భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్‌..

నటుడు సిద్ధార్థ్‌ (Siddharth) తాజాగా భావోద్వేగానికి గురయ్యారు.

Updated : 13 Apr 2024 17:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు సిద్ధార్థ్‌ (Siddharth) ఇటీవల చెన్నైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘చిత్తా’ చిత్రానికి గాను ‘మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఆయన అవార్డు సొంతం చేసుకున్నారు. అనంతరం సినిమా విశేషాలు పంచుకున్నారు. తమ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. దీనిని చూసి డిస్టర్బ్‌ అయ్యామంటూ పలువురు చేసిన వ్యాఖ్యలపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. ఇటీవల హిట్‌ అయిన బాలీవుడ్‌ మూవీని కొంతమంది ఎలాంటి ఇబ్బందిలేకుండా చూశారన్నారు. మనసుని హత్తుకునే కథతో సినిమా చేస్తే మాత్రం ఇబ్బందిగా అనిపించింది. సినిమా చూడలేకపోయామని కామెంట్స్‌ చేశారన్నారు. ఇది నిజంగానే సిగ్గుచేటు మనస్తత్వం అని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

‘టక్కర్‌’ తర్వాత సిద్ధార్థ్‌ నటించిన చిత్రం ‘చిత్తా’. ఎస్‌.యు.అరుణ్‌కుమార్‌ రూపొందించారు. చిన్న పిల్లలపై జరుగుతోన్న లైంగిక దాడుల నేపథ్యంలో క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కింది. సిద్ధార్థ్‌ ఇందులో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు. నిమిషా సజయన్‌, సహస్ర శ్రీ కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది. సిద్ధార్థ్‌, సహస్ర నటన ప్రేక్షకులతో కన్నీరు పెట్టించింది. ఇదే చిత్రాన్ని ‘చిన్నా’గా తెలుగులో విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని