Sidharth Malhotra: తెలుగు సినిమాలపై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్‌ హీరో..

రాజమౌళితో అవకాశం వచ్చే కచ్చితంగా నటిస్తానన్నారు బాలీవుడ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా.

Published : 28 Feb 2024 13:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా (Sidharth Malhotra) టాలీవుడ్‌పై ప్రశంసలు కురిపించారు. తన తాజా చిత్రం ‘యోధ’ ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన సిద్ధార్థ్‌ ‘గేమ్ ఛేంజర్‌’లో తన భార్య కియారా నటించడం ఆనందంగా ఉందన్నారు.

‘తెలుగు హీరోలు, దర్శకులంటే నాకెంతో అభిమానం. వాళ్లు సినిమా తీసే విధానం బాగుంటుంది. ఇక్కడ చాలామంది ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు. అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. రాజమౌళి అంటే నాకు ఇష్టం. ‘బాహుబలి’ కంటే ముందే ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రతి సన్నివేశాన్ని బాగా చూపిస్తారు. నా భార్య కియారా ప్రస్తుతం రామ్‌ చరణ్‌, శంకర్‌ల ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తోంది. ఆమె ఇక్కడి వర్క్‌ కల్చర్‌, తన అనుభవాల గురించి ఎప్పుడూ నాతో పంచుకుంటూ ఉంటుంది’ అని చెప్పారు. సిద్ధార్థ్‌ మల్హోత్రా నటించిన ‘యోధ’ మార్చి 15న విడుదల కానుంది. 

మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్‌ తేజ్‌ అలా.. ‘టిల్లు’ ఇలా!

‘గేమ్‌ ఛేంజర్‌’ విషయానికొస్తే..  రామ్‌  చరణ్‌ (Ram charan) కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రమిది. రాజకీయం నేపథ్యంలో సాగే ఈ సినిమాని ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే దీని కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణని షురూ చేశారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్‌లో అన్బరివ్‌ నేతృత్వంలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని