Bade Miyan Chote Miyan: అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ల సినిమా ప్రచారంలో గందరగోళం

అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌లు నటిస్తున్న చిత్రం ‘బడేమియా ఛోటేమియా’. దీని ప్రమోషన్‌లో కొందరు ఆకతాయిలు గందరగోళం సృష్టించారు.

Published : 27 Feb 2024 15:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), టైగర్‌ ష్రాఫ్‌(Tiger Shroff)లకు చేదు అనుభవం ఎదురైంది. వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ‘బడేమియా ఛోటేమియా’ (Bade Miyan Chote Miyan) ప్రమోషన్‌లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. లఖ్‌నవూలో ఈ స్టార్‌ హీరోలిద్దరూ వినూత్న రీతిలో ఈ సినిమా ప్రచారం సాగించారు. స్కైరోప్‌తో ఈవెంట్‌ జరిగే స్టేజ్‌పైకి వచ్చారు. ఈక్రమంలోనే కొందరు ఆకతాయిలు అత్యుత్సాహం ప్రదర్శించారు.

అందరి చూపు.. ఈ సిరీస్‌ల సీక్వెల్స్‌ వైపు.. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు?

హీరోలిద్దరూ స్టేజ్‌పైకి వచ్చాక కొందరు వారిపై చెప్పులు విసిరారు. దీంతో ఈవెంట్‌కు స్వల్ప అంతరాయం కలిగింది. కొంతసేపటికి అంతా సర్దుకోవడంతో తిరిగి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారి స్పీచ్‌లతో అక్కడున్న వారిలో జోష్‌ నింపారు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌ యాక్షన్‌ ప్రియులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌, మానుషి చిల్లర్‌ హీరోయిన్‌లుగా నటిస్తుండగా.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్‌ 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని