Pan India Movies: అక్కడివాళ్లు ఇక్కడ ఇక్కడివాళ్లు అక్కడ
పాన్ ఇండియా జమానా ఇది. భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. ఇది తెలుగు సినిమా, వీళ్లు హిందీ నటులు అని వేరు చేసి చూడలేం.
పాన్ ఇండియా జమానా ఇది. భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. ఇది తెలుగు సినిమా, వీళ్లు హిందీ నటులు అని వేరు చేసి చూడలేం. అన్ని సినిమాలూ అన్ని భాషల్లోకి వెళుతున్నాయి. నటులూ అదే తరహాలో ప్రేక్షకులకు చేరువవుతున్నారు. ఇదే అదనుగా దర్శకనిర్మాతలు సరికొత్త ప్రయత్నాలకి శ్రీకారం చుడుతున్నారు. అన్ని భాషల నటుల్ని కలుపుతూ... ఇదివరకు చూడని కలయికల్ని తెరపైకి తీసుకొస్తూ... ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. దాంతో తారలు తారుమారు అవుతూ ఇక్కడివాళ్లు అక్కడ... అక్కడివాళ్లు ఇక్కడ బిజీ అయిపోతున్నారు. ముఖ్యంగా కథానాయికలు!
దక్షిణాది కథానాయికలు హిందీ పరిశ్రమకి వెళ్లి సత్తా చాటడం కొత్తేమీ కాదు. అదే తరహాలో హిందీ తారలూ ఇక్కడి సినిమాల్లో అవకాశాల్ని అందుకుని ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు. అయితే అక్కడ అగ్ర కథానాయికలుగా చలామణీ అవుతున్న భామలు మాత్రం... ఇదివరకు ప్రాంతీయ భాషలపై అంతగా ఆసక్తి చూపేవారు కాదు. పాన్ ఇండియా ట్రెండ్ అలాంటి సమీకరణాల్ని మార్చేసింది. ఇప్పుడు బాలీవుడ్ అగ్ర తారలు సైతం తెలుగు, తమిళ తదితర ప్రాంతీయ పరిశ్రమలకొచ్చి నటిస్తున్నారు. అలాగే హిందీలో అగ్ర కథానాయకుల చిత్రాల్లో దక్షిణాది నాయికలకి ఇదివరకు ఎప్పుడో కానీ అవకాశాలు దక్కేవి కాదు. కానీ పాన్ ఇండియా ట్రెండ్తో మన కథానాయికల ప్రతిభ బలంగా వెలుగులోకి రావడం, వాళ్లకి అన్ని భాషల్లోనూ అభిమానులు ఏర్పడుతుండడంతో పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు. ఈ పరిణామాలతో ఎప్పటికప్పుడు తెరపై సరికొత్త కలయికలు దర్శనమిస్తున్నాయి.
తెలుగుపై మనసు
దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, కియారా అడ్వాణీ, దిశా పటానీ... వీళ్లంతా తెలుగు సినిమాలతో తెరపై సందడి చేయనున్న హిందీ భామలే. తెలుగు పరిశ్రమ నుంచి రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాల్ని అందుకున్నారు. అంతకుముందు అలియాభట్, అనన్యపాండే కూడా ‘ఆర్ఆర్ఆర్’, ‘లైగర్’ సినిమాలతో సందడి చేశారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కల్కి 2898ఎ.డి’ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణెతోపాటు, దిశాపటానీ నటించింది. వీళ్ల అందం ఆ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుంది. రామ్చరణ్ ‘గేమ్ ఛేంజర్’లో కియారా అడ్వాణీ నటించింది. ‘భరత్ అనే నేను’ నుంచీ కియారా క్రమం తప్పకుండా తెలుగు సినిమాల్లో నటిస్తూనే ఉంది. జాన్వీ కపూర్ ‘దేవర’తో తెలుగులో పరిచయం అవుతోంది. ఎన్టీఆర్ సరసన ఆమె నటిస్తుండడంతో అందరి దృష్టి ఈ కలయికపైనే ఉంది. రామ్చరణ్ - బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.
హిందీ చిత్రాలపై దృష్టి
పూజాహెగ్డే, కీర్తిసురేశ్, సాయిపల్లవి, రష్మిక... వీళ్లంతా దక్షిణాదిలో స్టార్ కథానాయికలుగా చలామణీ అయ్యారు. అగ్ర కథానాయకుల సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. వీళ్లంతా ఇప్పుడు హిందీ సినిమాలపై దృష్టిపెట్టారు. పూజాహెగ్డే ఎప్పట్నుంచో హిందీలో నటిస్తున్నా... దక్షిణాది కథానాయికగానే గుర్తింపు ఉంది. ఆమెకి ఎక్కువ విజయాలు ఉన్నది తెలుగులోనే. కొంతకాలంగా హిందీ సినిమాలతోనే గడుపుతోంది. ప్రస్తుతం షాహిద్ కపూర్తో కలిసి ‘దేవా’లో నటిస్తోంది. ‘బేబి జాన్’తో కీర్తి సురేశ్ హిందీలో పరిచయం అవుతోంది. రష్మిక.. ‘సికందర్’, ‘ఛావా’ చిత్రాల్లో నటిస్తుంది. సాయిపల్లవి ‘రామాయణ’లో అవకాశాన్ని అందుకుంది. ఇందులో రణ్బీర్ కపూర్ కథానాయకుడు. ఆమిర్ఖాన్ తనయుడు జునైద్ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాలోనూ సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. నయనతార, సమంత కూడా హిందీ సినిమాలపై ఓ కన్నేసి ఉంచారు. తమన్నా, రాశీఖన్నా తదితర భామలు తరచూ హిందీ సిరీస్లు, సినిమాల్లో నటిస్తూ అక్కడా ఇక్కడా రాణిస్తుంటారు. రకుల్ప్రీత్ సింగ్ కొంతకాలంగా పూర్తిగా హిందీ సినిమాలతోనే ప్రయాణం చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
‘కల్కి 2898 ఏడీ’ మ్యూజిక్ ఇలా క్రియేట్ చేశారు: సంతోశ్ నారాయణన్ మెమొరీస్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. దీనికి తానెలా మ్యూజిక్ అందించారో సంతోశ్ నారాయణన్ వివరించారు.
-
ఎన్నో చిత్రాల్లో చేసినా.. ‘లిల్లీ’గానే గుర్తున్నా : రష్మిక
విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ విడుదలై నేటికి ఐదేళ్లు. ఈసందర్భంగా రష్మిక స్పెషల్ పోస్ట్ పెట్టారు. -
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
తన పెళ్లి వార్తలపై మరోసారి స్పందించారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). -
అలాంటి వారికోసం సమయాన్ని వృథా చేసుకోవద్దు: పరిణితీ చోప్రా
ప్రపంచాన్ని మరిచిపోయి జీవించాలని తన అభిమానులకి జీవిత పాఠాలు చెబుతోంది పరిణితీ చోప్రా. -
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
Double Ismart movie: రామ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ ఓటీటీ డీల్ పూర్తయింది. -
నిహారిక ధైర్యాన్ని మెచ్చుకోవాలి : సిద్ధూ జొన్నలగడ్డ
‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సిద్ధూ జొన్నలగడ్డ పాల్గొన్నారు. -
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘రాయన్’ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరించిందా? -
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
కన్నడ నటుడు యశ్ 19వ చిత్రంగా ‘టాక్సిక్’ రూపుదిద్దుకుంటోంది. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. -
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
రాజ్తరుణ్ కథానాయకుడిగా రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన ‘పురుషోత్తముడు’ మూవీ ప్రేక్షకులను అలరించిందా? -
‘కమిటీ కుర్రోళ్ళు’ వచ్చేశారు.. ట్రైలర్ చూశారా?
యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
‘హాయ్ నాన్న’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటుడు నాని. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
సామాజిక మాధ్యమాల గురించి నటి జాన్వీకపూర్ (Janhvi kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులిచ్చి పొగిడించుకునే మనస్థత్వం తనది కాదని చెప్పారు. -
బాబీ దేవోల్తో యుద్ధానికి సిద్ధమైన అలియా.. వైరలవుతోన్న ‘ఆల్ఫా’ అప్డేట్!
అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. -
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
నటి టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
‘కల్కి’ స్క్రిప్ట్ రాయడానికి చాలా సమయం పట్టిందని దర్శకుడు నాగ్అశ్విన్ అన్నారు. అశ్వత్థామ పాత్రకు అమితాబ్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదని చెప్పారు. -
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
టాలీవుడ్పై నటి జాన్వీ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని ప్రశంసించారు. -
ఎన్టీఆర్ కోసం మరో విలన్?
‘దేవర’గా థియేటర్లలో సందడి చేయనున్నారు ఎన్టీఆర్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
‘కె.జి.ఎఫ్’ ప్రపంచంలోకి అజిత్?
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సరికొత్త కలయికకు రంగం సిద్ధం చేశారా? ‘కె.జి.ఎఫ్’ ప్రపంచంలోకి అగ్ర కథానాయకుడు అజిత్ను తీసుకొస్తున్నారా? అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ