Uppena: ఆ కారణంతోనే ‘ఉప్పెన’ వదులుకున్నా: శివానీ రాజశేఖర్‌

‘ఉప్పెన’లో కథానాయిక రోల్‌ కోసం మొదట తననే ఎంపిక చేశారని నటి శివానీ రాజశేఖర్‌ అన్నారు. అయితే.. తాను ఆ ఆఫర్‌ తిరస్కరించినట్లు తెలిపారు.

Updated : 26 Nov 2023 16:30 IST

హైదరాబాద్‌: వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej), కృతిశెట్టి (Krithi Shetty) జంటగా నటించిన యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ డ్రామా ‘ఉప్పెన’ (Uppena). అయితే, ఈ సినిమాలో కథానాయిక అవకాశం తొలుత తనకే వచ్చిందని రాజశేఖర్‌ కుమార్తె, నటి శివాని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

బోల్డ్‌ సీన్స్‌ ఎక్కువగా ఉన్న కారణంగా తాను ఆ ఆఫర్‌ వదులుకోవాల్సి వచ్చిందన్నారు. కథ విన్నప్పుడు కుటుంబంతో కలిసి ఈ సినిమా చూడగలనా అనే సందేహం వచ్చిందని.. అందుకే నో చెప్పానన్నారు. అయితే, తాను విన్న కథకు.. ప్రస్తుతం చూస్తున్న కథకు మార్పులు ఉన్నాయని అన్నారు.

Vanitha: వనితా విజయ్‌ కుమార్‌పై దాడి.. నటి పోస్టు వైరల్‌

‘అద్భుతం’తో నటిగా తెరంగేట్రం చేశారు నటి శివానీ రాజశేఖర్‌. ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’, ‘శేఖర్‌’ వంటి చిత్రాల్లో ఆమె నటించారు. ఆమె కీలక పాత్ర పోషించిన ‘కోటబొమ్మాళి పీఎస్‌’ ఇటీవల విడుదలైంది. మలయాళంలో విజయవంతమైన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘నాయట్టు’కు రీమేక్‌గా రూపొందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు