Tollywood: మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు..
అగ్రతారల నుంచి యువతారల వరకూ ఇదేమాట
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. చూపు తిప్పుకోనివ్వకుండా చేసే గ్రాఫిక్స్ హంగులు.. సాహసోపేతమైన విన్యాసాలతో కట్టిపడేసే హీరోయిజం.. ఇలా ఎన్నో వాణిజ్య హంగులకు చిరునామాగా నిలిచే చిత్రాలివి. అందుకే వీటికి పాన్ ఇండియా స్థాయిలోనే కాక ప్రపంచవ్యాప్తంగానూ మంచి గిరాకీ ఉంటుంది. నిజానికివి భారీ బడ్జెట్లను డిమాండ్ చేసే కథలైనా సరే.. ప్రేక్షకుల మెప్పు పొందాయంటే చాలు అంతకు రెట్టింపు వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటాయి. ఇప్పుడీ తరహా ఫాంటసీ థ్రిల్లర్లతోనే బాక్సాఫీస్ ముందు జోరు చూపించేందుకు పలువురు తారలు సిద్ధమవుతున్నారు. అందులో కొన్ని సినిమాలు ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించుకోగా.. మరికొన్ని పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన సినిమాల్లో సోషియో ఫాంటసీ థ్రిల్లర్ల వాటానే ఎక్కువ. ‘బంగార్రాజు’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’, ‘విరూపాక్ష’, ‘హను-మాన్’, ‘ఊరు పేరు భైరవకోన’.. ఇలా అనేక విజయాలు కనిపిస్తాయి. అయితే ఇప్పుడీ తరహా కథలతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు పలువురు అగ్రతారలు సిద్ధమవుతున్నారు. చిరంజీవి కెరీర్లో ప్రత్యేకంగా గుర్తుండిపోయే సోషియో ఫాంటసీ చిత్రాల్లో ‘అంజి’కి ప్రత్యేకమైన స్థానముంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని బాగా అలరించింది. కానీ, ఆ తర్వాత చిరు నుంచి మళ్లీ ఆ తరహా సినిమా రాలేదు. అయితే ఇన్నేళ్ల తర్వాత ‘విశ్వంభర’ రూపంలో మరో సరికొత్త ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ను ప్రేక్షకులకు రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు చిరంజీవి. ‘బింబిసార’తో తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న చిత్రమిది. పంచభూతాలతో ముడిపడి ఉన్న కథగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ముల్లోకాలతో ముడిపడిన అంశాలు ఉంటాయని టాక్. దీనికోసం ఓ ప్రత్యేకమైన ఊహా ప్రపంచాన్ని సృష్టిస్తోంది చిత్ర బృందం. అవన్నీ సినీప్రియులకు కొత్త అనుభూతి పంచిస్తాయని చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘కల్కి 2898ఏడీ’ అనే సైన్స్ ఫిక్షన్ చిత్రంతో త్వరలో సినీప్రియుల్ని పలకరించనున్నారు ప్రభాస్. ఇక ఆ తర్వాత ఆయన నుంచి రానున్న సినిమా ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం.. ఓ విభిన్నమైన రొమాంటిక్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్గానే ఉండనున్నట్లు సమాచారం.ఈ సినిమా కోసం మారుతి కూడా తనదైన శైలిలో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.
ఈ జానర్లోనే సూపర్ హీరో..
ప్రస్తుతం ‘తండేల్’ చిత్రం కోసం సెట్స్పై తీరిక లేకుండా శ్రమిస్తున్నారు హీరో నాగచైతన్య. ఆయన తదుపరి సినిమా కార్తీక్ దండుతో ఖరారైన సంగతి తెలిసిందే. ఇది కూడా కార్తీక్ తొలి చిత్రం ‘విరూపాక్ష’ తరహాలోనే ఫాంటసీ అంశాలతో నిండిన మిస్టీక్ థ్రిల్లర్గా ఉండనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. ఆధ్యాత్మికతకు సైన్స్ను ముడిపెట్టి చందూ మొండేటి తెరకెక్కించిన ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’. నిఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఫాంటసీ థ్రిల్లర్కు కొనసాగింపుగా ‘కార్తికేయ 3’ రానుంది. దీన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. రెండో భాగం కథ ఎక్కడైతే ముగిసిందో.. అక్కడి నుంచే ఈ మూడో భాగం కొనసాగనుంది.
‘హను-మాన్’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా.. ఇప్పుడు ‘మిరాయ్’ కోసం రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సూపర్ యోధ సినిమాలోనూ ఫాంటసీ అంశాలకు ప్రాధాన్యమున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్తో అర్థమైంది. ప్రస్తుతం ‘హను-మాన్’కు కొనసాగింపుగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ను సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆ తర్వాత ఆయన సినిమాటిక్ యూనివర్స్ నుంచి రానున్న సూపర్ హీరో సినిమాలన్నీ ఈ ఫాంటసీ జానర్లోనే సాగనున్నాయి. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించారు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నుంచి ఓ కొత్త కబురు బయటకొచ్చింది. కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. ఇది కిష్కిందపురి అనే ఓ ఫాంటసీ ప్రపంచంలో సాగే హారర్ మిస్టరీ కథగా ఉంటుందని సమాచారం. దీని చిత్రీకరణ త్వరలో మొదలు కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
తాను సినిమాలు చేయడం మాననని నటుడు విశాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
‘కల్కి 2898 ఏడీ’ మ్యూజిక్ ఇలా క్రియేట్ చేశారు: సంతోశ్ నారాయణన్ మెమొరీస్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. దీనికి తానెలా మ్యూజిక్ అందించారో సంతోశ్ నారాయణన్ వివరించారు.
-
ఎన్నో చిత్రాల్లో చేసినా.. ‘లిల్లీ’గానే గుర్తున్నా : రష్మిక
విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ విడుదలై నేటికి ఐదేళ్లు. ఈసందర్భంగా రష్మిక స్పెషల్ పోస్ట్ పెట్టారు. -
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
తన పెళ్లి వార్తలపై మరోసారి స్పందించారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). -
అలాంటి వారికోసం సమయాన్ని వృథా చేసుకోవద్దు: పరిణితీ చోప్రా
ప్రపంచాన్ని మరిచిపోయి జీవించాలని తన అభిమానులకి జీవిత పాఠాలు చెబుతోంది పరిణితీ చోప్రా. -
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
Double Ismart movie: రామ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ ఓటీటీ డీల్ పూర్తయింది. -
నిహారిక ధైర్యాన్ని మెచ్చుకోవాలి : సిద్ధూ జొన్నలగడ్డ
‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సిద్ధూ జొన్నలగడ్డ పాల్గొన్నారు. -
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘రాయన్’ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరించిందా? -
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
కన్నడ నటుడు యశ్ 19వ చిత్రంగా ‘టాక్సిక్’ రూపుదిద్దుకుంటోంది. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. -
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
రాజ్తరుణ్ కథానాయకుడిగా రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన ‘పురుషోత్తముడు’ మూవీ ప్రేక్షకులను అలరించిందా? -
‘కమిటీ కుర్రోళ్ళు’ వచ్చేశారు.. ట్రైలర్ చూశారా?
యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
‘హాయ్ నాన్న’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటుడు నాని. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
సామాజిక మాధ్యమాల గురించి నటి జాన్వీకపూర్ (Janhvi kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులిచ్చి పొగిడించుకునే మనస్థత్వం తనది కాదని చెప్పారు. -
బాబీ దేవోల్తో యుద్ధానికి సిద్ధమైన అలియా.. వైరలవుతోన్న ‘ఆల్ఫా’ అప్డేట్!
అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. -
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
నటి టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!