Yash: యశ్‌ చిత్రంపై ఊహాగానాలు.. స్పందించిన నిర్మాణ సంస్థ

యశ్‌ సినిమాపై వస్తోన్న ఊహాగానాలను నమ్మొద్దని నిర్మాణ సంస్థ పేర్కొంది. 

Updated : 23 Mar 2024 17:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యశ్‌ (Yash) హీరోగా మలయాళ దర్శకురాలు గీతూమోహన్‌ దాస్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘టాక్సిక్‌’ (Toxic). ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులైనా ఎలాంటి అప్‌డేట్స్‌ లేకపోవడంతో దీనిపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. తాజాగా ఇందులో హీరోయిన్ల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నిర్మాణసంస్థ స్పందించింది.

‘‘టాక్సిక్‌’ కోసం మీ ఆసక్తి చూస్తుంటే ఆనందంగా, ఉత్సాహంగా ఉంది. ఈ సినిమా నటీనటుల విషయంలో కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇలాంటి ఊహాగానాలను నమ్మొద్దని ప్రతిఒక్కరినీ అభ్యర్థిస్తున్నాం. ఈ చిత్రానికి (Toxic Movie) సంబంధించిన నటీనటుల ఎంపిక దాదాపు పూర్తయింది. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం. ఈ కథకు జీవం పోయడానికి చిత్ర బృందమంతా (Toxic Movie Makers) సిద్ధమవుతోంది. మా ప్రకటన కోసం వేచి ఉండాలని కోరుకుంటున్నాం’ అని మూవీ యూనిట్‌ పేర్కొంది.

యశ్‌ నటిస్తోన్న 19వ చిత్రమే ‘టాక్సిక్‌’. ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌.. అన్నది ఉపశీర్షిక. ‘కేజీఎఫ్‌’ సిరీస్‌ విజయాల తర్వాత యశ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీని ప్రచారచిత్రం కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. 2025 ఏప్రిల్‌ 10న ఇది (Toxic Movie) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో యశ్‌ (Yash) సరసన నటిస్తున్నారంటూ నలుగురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. మొదట సాయి పల్లవి పేరు బయటకు రాగా.. ఆ తర్వాత కరీనా కపూర్‌, శ్రుతి హాసన్‌, కియారా అడ్వాణీల పేర్లు వైరలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని