Vijay Sethupathi: కత్రినాతో సినిమా అనగానే షాక్‌ అయ్యా: విజయ్‌ సేతుపతి

కత్రినా కైఫ్‌తో కలిసి నటిస్తున్నట్లు చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయినట్లు విజయ్‌ సేతుపతి తెలిపారు.

Updated : 13 Jan 2024 16:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఈ సంక్రాంతికి ‘మెరీ క్రిస్మస్‌’తో పలకరించారు కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన విజయ్‌ ఈ సినిమాలో తనకు అవకాశం వచ్చినప్పుడు ఆశ్చర్యపోయినట్లు తెలిపారు.

‘దర్శకుడు ఈ చిత్రంలో హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ అని చెప్పగానే నేను షాక్‌ అయ్యాను. మేమిద్దరం కలిసి నటించే సన్నివేశాలు ఉన్నాయా అని అడిగాను.   ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎవరికి చెప్పినా వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో నటిస్తున్నానంటే.. ఓకే అన్నారు. కత్రినా హీరోయిన్ అని చెప్పగానే ‘అది నాయికా ప్రాధాన్యమున్న సినిమానా..? నువ్వు అతిథి పాత్రలో చేస్తున్నావా?’ అని అడిగారు. కత్రినా ఎంతపెద్ద నటి అనే విషయం అందరికీ తెలుసు. అందుకే ఈ చిత్రంలో నటించడానికి మొదట భయపడ్డా’ అని చెప్పారు.

‘మెరీ క్రిస్మస్‌’ విషయానికొస్తే.. క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందింది. ఒక సంఘటన ఇద్దరి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనేది కథాంశం. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకుడు. ఇందులో ఆల్బర్ట్‌గా విజయ్‌ సేతుపతి, మరియాగా కత్రినా వారి నటనతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి కత్రినా  భర్త విక్కీ కౌశల్‌ పోస్ట్‌ పెట్టారు. ఇందులో ఇద్దరి నటనా అద్భుతంగా ఉందని, పాత్రలకు ప్రాణం పోశారని ప్రశంసించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు