కథ కలిపింది..ఇద్దరినీ!
హిట్టు మాట వినిపించి... స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారంటే చాలు.. ఇక ఆ తర్వాత సదరు నాయికల ప్రయాణమంతా అందుకు తగ్గట్లుగా సాగాల్సిందే.
కుర్రహీరోలతో స్టార్ నాయికల సందడి
హిట్టు మాట వినిపించి... స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారంటే చాలు.. ఇక ఆ తర్వాత సదరు నాయికల ప్రయాణమంతా అందుకు తగ్గట్లుగా సాగాల్సిందే. స్టార్ హీరో.. స్టార్ దర్శకుడు.. అగ్ర నిర్మాణ సంస్థ.. ఇలా తమ స్టార్డమ్కు తగ్గట్లుగానే కాంబినేషన్లను సెట్ చేసుకుని కెరీర్ను పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే అప్పుడప్పుడు కొంతమంది స్టార్ భామలు కొత్త పంథాలో నడిచే ప్రయత్నం చేస్తుంటారు. కథలు డిమాండ్ చేసినట్లు అనిపిస్తే ఇమేజ్ను పక్కకు పెట్టి మరీ రంగంలోకి దిగిపోతుంటారు. ఫలితంగా సినీప్రియులకు కొన్ని భిన్నమైన కలయికల్ని చూసే అవకాశం దొరుకుతుంటుంది. ప్రస్తుతం ఇలా ప్రత్యేకమైన కలయికల్లో రూపుదిద్దుకుంటున్న సినిమాలు తెలుగులో కొన్ని కనిపిస్తున్నాయి. ఇప్పుడా జంటలు.. కథలు సినీప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
‘యానిమల్’ సినిమాతో హిట్టు కొట్టి జోరుమీదుంది కథానాయిక రష్మిక. ప్రస్తుతం ఆమె ‘పుష్ప 2: ది రూల్’, ‘సికందర్’, ‘కుబేర’ లాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్లతో తీరిక లేకుండా గడిపేస్తోంది. అయితే ఓవైపు సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్, ధనుష్ లాంటి స్టార్లతో ఆడిపాడుతూనే మరోవైపు దీక్షిత్ శెట్టి, దేవ్ మోహన్ లాంటి కుర్ర తారలతోనూ తెర పంచుకుంటూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది రష్మిక. ప్రస్తుతం ఆమె చేతిలో ‘రెయిన్బో’, ‘ది గర్ల్ఫ్రెండ్’ అనే రెండు నాయికా ప్రాధాన్య చిత్రాలున్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిలో శాంతరూబన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రెయిన్బో’. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాలో రష్మిక సరసన నటిస్తోంది మలయాళ యువ హీరో దేవ్ మోహన్. ఈ చిత్రంలో వీళ్లిద్దరి జంట.. కథ కథనాలు సినీప్రియుల్ని ఆశ్చర్యపరుస్తాయని చిత్ర వర్గాలు ఇది వరకే ప్రకటించాయి. ఇక రష్మిక ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్న మరో నాయికా ప్రాధాన్య చిత్రం ‘ది గర్ల్ఫ్రెండ్’. ఇందులోనూ రష్మికతో జోడీ కట్టనుంది కుర్ర హీరోనే. అతనే కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి. ‘దసరా’లో నానికి మిత్రుడిగా కనిపించి మెప్పించిన ఆయన.. ఇప్పుడిందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
వీలు కుదిరితే చాలు
కథానాయిక కాజల్ కూడా కొన్నాళ్లుగా పంథా మార్చింది. ఓవైపు అగ్ర కథానాయకులతో జట్టు కడుతూనే అవకాశం వచ్చినప్పుడల్లా యువ హీరోలతోనూ ఆడిపాడుతోంది. ఆ మధ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో ‘కవచం’, ‘సీత’ చిత్రాల్లో నటించిందామె. ఇప్పుడు ‘సత్యభామ’ కోసం నవీన్చంద్రతో జోడీ కట్టింది. ఇది కూడా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే జంటే. వినూత్నమైన క్రైమ్ థ్రిల్లర్గా ముస్తాబైన ఈ సినిమాలో కాజల్ శక్తిమంతమైన పోలీసు పాత్రలో కనిపించనుంది. సుమన్ చిక్కాల తెరకెక్కించారు. ‘ఇస్మార్ట్ శంకర్’, ‘డిస్కోరాజా’, ‘మాస్ట్రో’ చిత్రాలతో అందర్నీ అలరించింది నభా నటేష్. ఇప్పుడామె ‘డార్లింగ్’తో సినీప్రియుల్ని మురిపించేందుకు సిద్ధమవుతోంది. అశ్విన్ రామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో నభా..ప్రియదర్శికి జోడీగా నటించడం విశేషం. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ విభిన్నమైన రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
సిరీస్ కోసం సుహాస్తో కీర్తి!
‘మహానటి’తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేశ్. హాస్య నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించి.. ఇప్పుడు కథానాయకుడిగా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ వస్తున్నారు సుహాస్. ఇప్పుడీ ఇద్దరి ప్రత్యేకమైన కాంబినేషన్లో ఓ వెబ్సిరీస్ రానుంది. అదే ఐవీ శశి తెరకెక్కిస్తున్న ‘ఉప్పు కప్పురంబు’. సంక్షోభంలో చిక్కుకున్న ఓ గ్రామ ప్రజలు దాని నుంచి ఎలా బయట పడ్డారన్నది ఈ సిరీస్ ప్రధాన ఇతివృత్తం. సెటైరికల్ కామెడీ డ్రామాగా ఉంటుంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభించుకోనున్న ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది.
భలే లాభం..
ఓ స్టార్ కథానాయిక కుర్ర హీరోతో కలిసి జోడీ కడుతుందంటే చాలు కచ్చితంగా ప్రేక్షకుల దృష్టి ఈ కలయికలపై పడుతుంటుంది. అది సినిమాకే కాదు.. సదరు నాయికలకూ లాభసాటి వ్యవహారమే. పారితోషికం ఎక్కువ దక్కించుకునే వీలుంటుంది. అలాగే యువహీరోలతో ఆడిపాడుతూ తామింకా కుర్ర భామలమే అనే సంకేతాలు ఇచ్చినట్లవుతుంది. ఫలితంగా వాళ్ల కెరీర్ను మరింత పొడిగించుకునే ఆస్కారం దొరుకుతుంది. ఇటీవల కాలంలో ఈతరహా కలయికలు విరివిగా తెరపైకి రావడానికి మారిన ప్రేక్షకుల అభిరుచులే ప్రధాన కారణమంటున్నారు సినీ విశ్లేషకులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాక్షన్ ఫాంటసీ సిరీస్ను ప్రకటించిన రాజ్ అండ్ డీకే.. టైటిలిదే
రాజ్ అండ్ డీకే కొత్త సిరీస్ను ప్రకటించారు. ‘రక్త్ బ్రహ్మాండ్’ పేరుతో ఇది రానుంది. -
అల్లరి నరేశ్ కొత్త సినిమా.. కీలకపాత్రలో యంగ్ హీరోయిన్
అల్లరి నరేశ్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలను నిర్మాణ సంస్థ షేర్ చేసింది. -
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో చిరంజీవి ఫ్యామిలీ పాల్గొంది. -
దీపికా పదుకొణెతో ఇంటిమేట్ సీన్స్.. భయాందోళనకు గురయ్యా: బాలీవుడ్ నటుడు
‘గెహ్రీయాన్’ కోసం నటి దీపికా పదుకొణె (Deepika Padukone)తో ఇంటిమేట్ సీన్స్లో నటించడం తననెంతో ఇబ్బందికి గురి చేసిందని బాలీవుడ్ నటుడు తెలిపారు. -
విజయ్ సేతుపతి హిట్ సినిమాను రీమేక్ చేయనున్న బాలీవుడ్ హీరో!
విజయ్ సేతుపతి హిట్ సినిమాను బాలీవుడ్ హీరో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
ఆ దేశంలో ‘హనుమాన్’ రిలీజ్.. ప్రశాంత్ వర్మ పోస్ట్
తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). త్వరలో ఇది ఓ దేశంలో విడుదల కానుందని ప్రశాంత్ వర్మ తెలిపారు. -
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై నెట్టింట పోస్టులు.. అనుకున్న రోజుకు రావడం కష్టమేనా!
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. -
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్పై ‘రాయన్’ టీమ్ ఆనందం వ్యక్తంచేసింది. -
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు