UAE Lottery: స్నేహితుడి సలహాతో.. ప్రవాస భారతీయుడికి రూ.36 కోట్ల జాక్‌పాట్‌!

Eenadu icon
By Nri News Team Published : 03 Nov 2025 20:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్: యూఏఈలో నివసిస్తున్న ఓ ప్రవాస భారతీయుడికి లాటరీ రూపంలో అదృష్టం వరించింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ స్నేహితుడి సలహాతో ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు. బిగ్‌ టికెట్‌లో దాదాపు రూ.36 కోట్లు గెలుచుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సందీప్‌ కుమార్‌ ప్రసాద్‌ (30) యూఏఈలో షిప్పింగ్‌ రంగంలో టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. బంగ్లాదేశ్‌కు చెందిన తన మిత్రుడు జహంగీర్‌ ఆలమ్‌ సలహాతో మూడు నెలలుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేయడం ప్రారంభించాడు.

ఈ క్రమంలోనే కొంతమందితో కలిసి ఆగస్టులో కొనుగోలు చేసిన టికెట్‌తో అతడికి జాక్‌పాట్‌ తగిలింది. లాటరీ గెలుచుకున్నట్లు ఫోన్‌ వచ్చినప్పుడు తాను నమ్మలేదని, ఆ తర్వాత ఎంతో సంతోషించినట్లు చెప్పాడు. తాను స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నానని, అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి చికిత్స అందిస్తానని భావోద్వేగంతో తెలిపాడు. తన స్నేహితుడి వల్లే ఇదంతా సాధ్యమైందని తాజాగా పేర్కొన్నాడు. జహంగీర్‌ సైతం గతంలో ఇదే లాటరీలో రూ.48 కోట్లు గెలుచుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని