New Jersey: ‘ఎన్ఆర్ఐలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలి’: మన్నవ మోహన కృష్ణ
ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ‘మీట్ విత్ మన్నవ మోహన కృష్ణ’ కార్యక్రమంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధి పునరుద్ధరణ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు చూపిస్తున్న నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రాన్ని సాంకేతికత, పారిశ్రామిక, ఇన్నోవేషన్ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం దూరదృష్టితో ఏపీ కొత్త దిశగా పయనిస్తోందన్నారు. గూగుల్తో ఒప్పందం, క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్లు రాష్ట్రాన్ని ప్రపంచ సాంకేతిక కేంద్రంగా నిలబెడతాయని పేర్కొన్నారు.

ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలు స్థాపించి, పెట్టుబడులు పెట్టి, టెక్నాలజీని రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు. ఏపీ అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల పాత్ర ఎంతో కీలకమన్నారు. మీ పెట్టుబడులు, మీ సహకారం ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లగలవని పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టి రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం ఎన్ఆర్ఐలు మన్నవ మోహన కృష్ణని సత్కరించారు. ఏపీలోని అభివృద్ధి రంగాలపై విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన ఎన్ఆర్ఐలులు మోహన కృష్ణతో పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు, వ్యాపారవేత్తలు, అమెరికా తెదేపా నాయకులు, స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

స్నేహితుడి సలహాతో.. ప్రవాస భారతీయుడికి రూ.36 కోట్ల జాక్పాట్!
యూఏఈలో నివసిస్తున్న ఓ ప్రవాస భారతీయుడికి లాటరీ రూపంలో అదృష్టం వరించింది. - 
                                    
                                        

న్యూజెర్సీలో ‘చిత్ర గాన లహరి’.. మంత్రముగ్ధులైన ప్రేక్షకులు
తానా, కళావేదిక, గుడ్ వైబ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చిత్ర గాన లహరి’ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. న్యూజెర్సీలోని ప్లెయిన్ఫీల్డ్ హైస్కూల్ ఆడిటోరియం వేదికగా జరిగిన తెలుగు సంగీత విభావరి అలరించింది. - 
                                    
                                        

‘దుబాయి రైడ్’.. సోషల్ మీడియాలో చూసి.. విమానం ఎక్కేసి..!
సైకిల్ తొక్కడం వల్ల ఫిట్నెస్ పెరుగుతుందన్న విషయం తెలిసిందే. అందుకే.. దుబాయి యువరాజు, ఉప ప్రధాని షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం గత కొన్నాళ్లుగా ‘దుబాయి రైడ్ ఫిట్నెస్ ఛాలెంజ్’ను నిర్వహిస్తున్నారు. - 
                                    
                                        

ఫ్రాంక్ఫర్ట్: IKVG ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో ఇండిష్ కూల్టూర్ వెరైన్ గీసెన్ e.V (IKVG) ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. - 
                                    
                                        

ఖతార్లో కార్తీక మాస వనభోజనాలు.. పెద్దఎత్తున హాజరైన ప్రవాసాంధ్రులు
పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా గల్ఫ్ దేశం ఖతార్లో నివసిస్తున్న తెలుగు సభ్యులు సంప్రదాయ పద్ధతిలో వనభోజనాలు ఘనంగా నిర్వహించారు. - 
                                    
                                        

ఒంగోలులో మొంథా తుపాన్ బాధితులకు తానా అన్నదానం
మొంథా తుపాన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సాయంగా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. - 
                                    
                                        

తుపాను బాధితులకు ‘తానా’ మానవతా సహాయం
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) మరోసారి సేవా స్ఫూర్తిని చాటింది. - 
                                    
                                        

‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ‘‘దండక సాహిత్యం - ఉనికి, ప్రాభవం’’ సభ
‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘‘నెల నెలా తెలుగు వెలుగు’’ పేరిట ఐదేళ్లుగా ప్రతి నెలా చివరి ఆదివారం అంతర్జాలంలో సాహిత్య సదస్సులు నిర్వహిస్తోంది. - 
                                    
                                        

ఘనంగా ‘ఆటా’ 19వ మహాసభల కిక్ ఆఫ్ వేడుక
అమెరికా అంతటా వివిధ సేవా కార్యక్రమాలతో అమెరికా తెలుగు సంఘం (ATA)బాల్టిమోర్లో 19వ మహాసభలను, యువజన సదస్సును నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా బాల్టిమోర్లో సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించింది. - 
                                    
                                        

వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్ రద్దు.. వేల మంది భారతీయ ఉద్యోగులపై పిడుగు
US Work Permits: వలసదారుల వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్ విధానాన్ని రద్దు చేస్తూ అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. - 
                                    
                                        

డాలస్లో ఘనంగా ‘నెల నెలా తెలుగువెన్నెల’ సాహిత్య సదస్సు
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, టాంటెక్స్ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగువెన్నెల’ 219వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. అక్టోబర్ 19న డాలస్లోని సమావేశ మందిరం ఈ సాహితీ సదస్సుకు వేదికైంది. - 
                                    
                                        

హుషారుగా తానా మిడ్ అట్లాంటిక్ లేడీస్ నైట్
అమెరికాలోని ఫిలడెల్పియాలో తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి లేడీస్ నైట్ ఈవెంట్ హుషారుగా సాగింది. - 
                                    
                                        

తానా న్యూజెర్సీ హైకింగ్ ఈవెంట్ ‘బెటర్ టుమారో బిగిన్స్ విత్ ఎ స్టెప్’ విజయవంతం
తానా న్యూజెర్సీ విభాగం నిర్వహించిన హైకింగ్ ఈవెంట్ ‘బెటర్ టుమారో బిగిన్స్ విత్ ఎ స్టెప్’ ఘనంగా జరిగింది. - 
                                    
                                        

కోవెంట్రీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
కోవెంట్రీ తెలుగు అసోసియేషన్ (CoTA) ఆధ్వర్యంలో శ్రీకృష్ణ టెంపుల్ హాల్లో దీపావళి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. దాదాపు 330 మంది సభ్యులు, కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. - 
                                    
                                        

అమెరికాలో మనం.. ఇలా ‘పది’లం
అగ్రరాజ్యం అమెరికాలో పలుచోట్ల ప్రవాస భారతీయుల ఉనికికి ప్రమాదకరంగా మారుతున్న పలు ఘటనల నేపథ్యంలో ఎన్నారై సంఘాల నేతలు కీలక సూచనలు చేశారు. - 
                                    
                                        

‘మనాస్లు’లో ఎన్నారైల బృందం ట్రెక్కింగ్.. 14రోజుల సాహస యాత్ర విశేషాలివీ!
సుదూర పాదయాత్రలే లక్ష్యంగా ముందుకెళ్తున్న లండన్కు చెందిన డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరి ప్రపంచంలో ఎనిమిదో ఎత్తయిన మౌంట్ మనాస్లు సర్క్యూట్ ట్రెక్ను విజయవంతంగా పూర్తి చేశారు. - 
                                    
                                        

గుంటూరు వైద్యుడికి జమైకా అత్యున్నత పురస్కారం
గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ డాక్టర్ చందోలు నాగమల్లేశ్వరరావుకు అరుదైన గౌరవం దక్కింది. - 
                                    
                                        

టెక్సాస్ గవర్నర్ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు
అమెరికాలోని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ అధికారిక నివాసంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. - 
                                    
                                        

ఏపీకి మేలు చేసే ఏ అవకాశాన్నీ వదిలిపెట్టొద్దు: ప్రవాసాంధ్రులతో భేటీలో మంత్రి లోకేశ్
కూటమి ప్రభుత్వం పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. - 
                                    
                                        

కొత్తగూడెం పాఠశాలకు ఫర్నిచర్ అందించిన పొట్లూరి రవి
వివిధ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తనవంతు సాయం అందిస్తున్నారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 - 
                        
                            

వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టులో సునీల్యాదవ్ కౌంటర్ దాఖలు
 - 
                        
                            

ప్రపంచంలో నెక్ట్స్ సూపర్ పవర్గా భారత్: ఫిన్లాండ్ అధ్యక్షుడు
 - 
                        
                            

భారత్లోని కుబేరుల సంపద 23 ఏళ్లలో 62% వృద్ధి: జీ20 నివేదిక
 - 
                        
                            

‘రాజా సాబ్’ వాయిదాపై క్లారిటీ.. ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..!
 


