AP news: తీర ప్రాంతాన్ని దోచుకునేందుకు జగన్ కుట్ర: ఆనం
దేశంలో ఏపీకి అతిపెద్ద తీర ప్రాంతం ఉందని.. దీనిపై జగన్ కళ్లు పడ్డాయని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు.
అమరావతి: దేశంలో ఏపీకి అతిపెద్ద తీర ప్రాంతం ఉందని.. దీనిపై జగన్ కళ్లు పడ్డాయని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తీర ప్రాంతాన్ని గేట్ వే ఆఫ్ ఇండియాగా మార్చాలని చంద్రబాబు అనుకుంటే.. జగన్ మాత్రం ‘గేట్ వే ఆఫ్ జగన్’ గా మార్చారని విమర్శించారు. 2019లో జగన్ అధికారంలోకి రాగానే ఆయన కళ్లు తీరప్రాంతంపై పడ్డాయని దుయ్యబట్టారు.
‘‘కబ్జా చేయాలనుకుంటే మొదట జగన్కు గుర్తొచ్చేది విజయసాయిరెడ్డి. దీంతో ఆయన్ని రంగంలోకి దింపారు. విజయసాయిరెడ్డి వియ్యంకుల కంపెనీ అరబిందో. ఈ సంస్థ జగన్కు బినామీగా వ్యవహరిస్తోంది. విజయసాయిరెడ్డి కూడా ఆయనకు బినామీనే. మంచి లాభాలతో ఉన్న కాకినాడ సీ పోర్టుపై మొదట జగన్ కళ్లు పడ్డాయి. 2019 నుంచి కేఎస్పీఎల్పై దాడి మొదలైంది. షేర్లు ఇవ్వాలని బెదిరించినా ఆ సంస్థ ఒప్పుకోలేదు. ఏటా రూ.300 కోట్లు లాభాల్లో ఉన్న కంపెనీ వాటా ఇవ్వబోమని తెగేసి చెప్పింది. దీంతో ప్రభుత్వానికి రూ.965.65 కోట్లు ఎగ్గొట్టిందని రిపోర్టు తెచ్చారు. విజయసాయిరెడ్డి వెళ్లి బెదిరిస్తే.. డబ్బు కడతామని ఆ సంస్థ చెప్పేసింది. ఇంత బెదిరించినా కేఎస్పీఎల్ లొంగలేదని మళ్లీ ఆడిట్కు ఆదేశించారు. షేర్ హోల్డర్లు, డైరెక్టర్లు, సీఈవోలను జైలుకు పంపిస్తామని బెదిరించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే వైకాపా అక్రమంగా సంపాదించిన డబ్బును వడ్డీతో సహా వసూలు చేస్తాం’’ అని ఆనం వెంకటరమణారెడ్డి హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?