Annamalai: 24గంటల ఫుడ్ బ్యాంక్లు, ఐఐఎం ఏర్పాటు: అన్నామలై హామీలు
కోయంబత్తూరు భాజపా అభ్యర్థి అన్నామలై ఆ నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారు.
కోయంబత్తూరు: లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కోయంబత్తూరు నుంచి బరిలో ఉన్న తమిళనాడు భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై (Annamalai) జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 19న జరగబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే కోయంబత్తూరుకు ఐఐఎంతో పాటు ఎన్ఐఏ, ఎన్సీబీ విభాగాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 500 రోజుల్లో 100 హామీల కోసం పార్టీ కృషి చేస్తుందన్నారు.
కేజ్రీవాల్ ‘ఆలోచనలను’ నిర్బంధించలేరు - పంజాబ్ సీఎం
నవోదయ పాఠశాలల ఏర్పాటు, నొయ్యల్, కౌసికా నదుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) యూనిట్లను కోయంబత్తూరులో ఏర్పాటు చేస్తామన్నారు. లెజెండరీ నేత, మాజీ సీఎం కె.కామరాజ్ పేరిట 24 గంటల పాటు పనిచేసే ఫుడ్ బ్యాంకులను ప్రవేశపెడతామని ప్రకటించారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతాన్న అన్నామలై.. ప్రజలు తనను ఆశీర్వదిస్తే కోయంబత్తూరును అంతర్జాతీయ ముఖచిత్రంపై నిలుపుతానన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
సీఎం రేవంత్రెడ్డి స్థాయి మరిచి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!