AK Antony: నా కుమారుడు ఓడిపోవాలి.. కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఓడిపోవాలని కోరుకున్నారు.
AK Antony | తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ (AK Antony) కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలోని పదనంతిట్ట లోక్సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి పోటీ చేస్తున్న తన కుమారుడు అనిల్ కె.ఆంటోని ఓటమిని కోరుకున్నారు. యూడీఎఫ్ అభ్యర్థి ఆంత్రో ఆంటోని విజయం సాధించాలన్నారు. ఈమేరకు మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు పోటీ చేస్తున్న పార్టీ ఓడిపోవాలని, అతడి ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎక్కడా తన కుమారుడి పేరును మాత్రం నేరుగా ఆంటోనీ ప్రస్తావించలేదు.
కొబ్బరి నేలను కొట్టేదెలా?.. కేరళ జననాడిని పట్టలేకపోతున్న భాజపా
తన మతం కాంగ్రెస్ అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ నేతల కుమారులు భాజపాలో చేరడం తప్పని వ్యాఖ్యానించారు. తండ్రి వ్యాఖ్యలపై అనిల్ ఆంటోని స్పందించారు. ఏకే ఆంటోనిని చూస్తే తనకు జాలేస్తోందన్నారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న గాంధీ కుటుంబం కోసం ఆయన మాట్లాడుతున్నారన్నారు. జూన్ 4న ప్రధాని మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు. మోదీ నేతృత్వంలోని భాజపా మాత్రమే దేశాన్ని ముందుకుతీసుకెళ్లగలదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కాలం చెల్లిన నాయకులతో నిండిపోయిందని విమర్శించారు. ఏప్రిల్ 26న రెండోవిడత పోలింగ్లో పతనంతిట్ట లోక్సభ స్థానానికి పోలింగ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
కడప జిల్లా వేంపల్లి మండలం కుమ్మరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి చేదు అనుభవం ఎదురైంది. -
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.