AP CID: స్కిల్‌ కేసు.. తెదేపాకు సీఐడీ నోటీసులు

తెదేపాకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. పార్టీకి సంబంధించిన ఖాతాల వివరాలను ఈనెల 18లోపు ఇవ్వాలని అందులో పేర్కొంది.

Updated : 14 Nov 2023 15:57 IST

అమరావతి: తెదేపాకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. పార్టీకి సంబంధించిన ఖాతాల వివరాలను ఈనెల 18లోపు ఇవ్వాలని అందులో పేర్కొంది. తెదేపా కేంద్ర కార్యాలయానికి సీఐడీ కానిస్టేబుల్‌ వెళ్లి కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబుకు ఈ నోటీసులు అందజేశారు. 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు నేపథ్యంలో పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాల వివరాలు కావాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. సీఐడీ అధికారులు వేధిస్తున్నారంటూ ఇప్పటికే తెదేపా హైకోర్టును ఆశ్రయించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని