Congress: వేధిస్తున్నారని చెబితే.. వేటు వేశారు! వివాదంలో కాంగ్రెస్
ఇండియన్ యూత్ కాంగ్రెస్ చీఫ్ బి.వి. శ్రీనివాస్పై వేధింపుల ఆరోపణలు చేసిన అస్సాం యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అంకిత దత్తాపై హస్తం పార్టీ (Congress) వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గానూ ఆరేళ్ల పాటు బహిష్కరించింది.
దిల్లీ: అస్సాం (Assam) యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అంకిత దత్తా (Angkita Dutta)పై కాంగ్రెస్ (Congress) పార్టీ వేటు వేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పార్టీలో కొందరు తనను వేధిస్తున్నారంటూ అంకిత ఆరోపణలు చేసిన రోజుల వ్యవధిలోనే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై భాజపా (BJP) స్పందిస్తూ.. హస్తం పార్టీకి చురకలంటించింది. అసలేం జరిగిందంటే..
ఇండియన్ యూత్ కాంగ్రెస్ చీఫ్ బి.వి. శ్రీనివాస్ (Srinivas B V) తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని, తనపై వివక్ష చూపిస్తున్నారని అంకిత ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ (Congress) అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా దృష్టికి తీసుకెళ్లినా.. వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీనిపై గత బుధవారం ఆమె దిస్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే అస్సాం పోలీసు సీఐడీ విభాగం.. శ్రీనివాస్కు సమన్లు జారీ చేసింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని అటు జాతీయ మహిళా కమిషన్ కూడా రాష్ట్ర పోలీసులను కోరింది.
ఈ వివాదం కొనసాగుతుండగానే.. అంకిత (Angkita Dutta)పై కాంగ్రెస్ బహిష్కరణ వేటు వేసింది. ఈ మేరకు కాంగ్రెస్ క్రమశిక్షణా చర్యల కమిటీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గానూ ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని ఆరేళ్ల పాటు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అంకిత చేసిన ఆరోపణలు నిరాధారం, రాజకీయ ప్రేరేపితమైనవిగా గుర్తించినట్లు అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ నేతల పరువుకు భంగం కలిగించే చర్యలకు పాల్పడినందుకు గానూ ఆమెను బహిష్కరించినట్లు తెలిపాయి.
భాజపా వ్యంగ్యాస్త్రాలు..
కాగా.. ఈ పరిణామాలపై స్పందించిన భాజపా (BJP).. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించింది. ‘‘మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ అవలంబిస్తున్న విధానమిది..! సీనియర్ నేతలు వేధిస్తున్నారని చెప్పిన మహిళ సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఆమెపైనే వేటు వేశారు. అంకిత దత్తా విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం.. ఆమోదయోగ్యం కాదు. ‘నేను మహిళను.. నేను పోరాడగలను’ అని కాంగ్రెస్ చెప్పే నినాదం.. వట్టి మాటే’’ అని భాజపా ఎద్దేవా చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు