Atchannaidu: తప్పుడు కేసులు పెడితే ప్రజలు నమ్మేస్థితిలో లేరు: అచ్చెన్నాయుడు

రాజకీయ కక్షలతో ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడమే సీఎం జగన్‌ పని అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

Updated : 10 Sep 2023 14:53 IST

విశాఖపట్నం: రాజకీయ కక్షలతో ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడమే సీఎం జగన్‌ పని అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతిపక్ష నాయకులను జైలులో పెట్టి ఆయన ఆనందపడుతున్నారని వ్యాఖ్యానించారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో విశాఖలో అచ్చెన్న మీడియాతో మాట్లాడారు.

రాజకీయ కక్షతోనే అరెస్ట్‌ చేశారు: కోర్టులో స్వయంగా చంద్రబాబు వాదనలు

‘‘జగన్‌ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. చంద్రబాబును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఇరికించి అక్రమంగా అరెస్ట్‌ చేశారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన వ్యక్తి చంద్రబాబు. దేశంలో ఏ ఒక్కరిని అడిగినా ఆయన దార్శనికతను చెబుతారు. జగన్‌ 16 నెలలు జైల్లో ఉన్నందున.. ఒక్కరోజైనా చంద్రబాబును అలా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారు. పరిపాలనపై అవగాహన ఉన్న కొంతమంది సీనియర్‌ మంత్రులైనా ఇది సరికాదని మూర్ఖపు ముఖ్యమంత్రికి చెప్పాలి. తప్పుడు కేసులు పెడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇంతకంటే ఎక్కువగా మీరు అనుభవిస్తారు’’అని అచ్చెన్నాయుడు అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని