Balakrishna: వైకాపా అరాచక పాలనను అంతం చేయాలి: నందమూరి బాలకృష్ణ

వైకాపా అరాచక పాలనను అంతం చేయడానికి  ప్రజలంతా సిద్ధం కావాలని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు.

Published : 14 Apr 2024 19:46 IST

సింగనమల: వైకాపా అరాచక పాలనను అంతం చేయడానికి  ప్రజలంతా సిద్ధం కావాలని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం కల్లూరులో ఆదివారం ‘స్వర్ణాంధ్ర సాధికార  బస్సు యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఐదేళ్లలో వైకాపా నాయకులు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం సాధ్యమవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని