BJP: అమిత్‌షాతో మరోసారి బండి సంజయ్‌ భేటీ.. భాజపా వర్గాల్లో చర్చ

కేంద్రమంత్రి అమిత్‌షాతో భాజపా ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ మరోసారి భేటీ అయ్యారు.

Updated : 17 Sep 2023 14:30 IST

హైదరాబాద్‌: కేంద్రమంత్రి అమిత్‌షాతో భాజపా ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ మరోసారి భేటీ అయ్యారు. శనివారం రాత్రి అమిత్‌షాతో సంజయ్‌ సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఆదివారం భాజపా ముఖ్యనేతలతో అమిత్‌షా సమావేశం కావాల్సినప్పటికీ భేటీ జరగలేదు. ఇంతలో మధ్యాహ్నం మళ్లీ బండి సంజయ్‌తోనే ఆయన సమావేశం కావడంపై భాజపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాల భాజపా ఎమ్మెల్యేలు పర్యటించారు. క్షేత్రస్థాయిలో పర్యటన అనంతరం వారు హైకమాండ్‌కు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమిత్‌షాతో బండి సంజయ్‌ వరుసగా భేటీ కావడంపై చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని