6 గ్యారంటీలకు ‘వారంటీ’ లేదన్న వారికి.. చెంపదెబ్బ తగిలేలా ప్రజలే చేశారు: భట్టి

ఖమ్మం జిల్లాలలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao), పొంగులేటి  శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy) కలిసి పర్యటించారు.

Updated : 10 Dec 2023 14:20 IST

ఖమ్మం: రాష్ట్రంలో బహుళార్ధక ప్రాజెక్టులు చేపడతామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao), పొంగులేటి  శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy)తో కలిసి ఆయన ఖమ్మంకు వచ్చారు. ఈ సందర్భంగా వారికి నాయకన్‌గూడెం వద్ద భారీ గజమాలతో కాంగ్రెస్‌ కార్యకర్తలు స్వాగతం పలికారు. కూసుమంచిలో ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను మంత్రులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి (Bhatti Vikramarka) మాట్లాడారు.

కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌ రెడ్డి

‘‘ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది. ఆరు గ్యారంటీల్లో 2 గ్యారంటీలను 2 రోజుల్లోనే ప్రారంభించాం. రాష్ట్ర వనరులను సంపద సృష్టికి వాడుతాం. సృష్టించిన సంపదను ప్రజలకు పంచడమే కాంగ్రెస్‌ అజెండా. పరిశ్రమలు, ఐటీ, సేవారంగాన్ని ప్రోత్సహిస్తాం. ఆరు గ్యారంటీలను మొదటి వంద రోజుల్లో అమలు చేస్తాం. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో మరిన్ని హామీలు పొందుపరిచాం. ఆరు గ్యారంటీలకు వారంటీ లేదని భారాస విమర్శించింది. వారంటీ లేదన్న పెద్దలకు చెంపదెబ్బ తగిలేలా ప్రజలు చేశారు’’ అని భట్టి వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని