Mahua Moitra: మహువా మొయిత్రా vs రాజమాత.. బెంగాల్లో మరో ఆసక్తికర పోరు
Mahua Moitra: టీఎంసీ అభ్యర్థి మహువా మొయిత్రాకు పోటీగా రాజమాత అమృతా రాయ్ని రంగంలోకి దించింది భాజపా. దీంతో కృష్ణానగర్ లోక్సభ పోరు రసవత్తరంగా మారింది.
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ (West Bengal)పై భారతీయ జనతా పార్టీ (BJP) గట్టిగా దృష్టిపెట్టింది. 42 స్థానాలున్న ఈ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో (Lok sabha Elections) వీలైనన్ని ఎక్కువస్థానాలు గెలిచేందుకు పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అభ్యర్థుల ఎంపికలోనూ అంతే పక్కాగా వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే టీఎంసీ కీలక నేత మహువా మొయిత్రా (Mahua Moitra)కు పోటీగా స్థానిక రాజమాత (Rajamata)ను నిలబెట్టింది. దీంతో కృష్ణానగర్ పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
భాజపా ఆదివారం 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో పశ్చిమ బెంగాల్లో 19 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నదియా జిల్లాలోని కృష్ణానగర్ నుంచి రాజవంశస్థురాలైన రాజమాత అమృతా రాయ్ (Amrita Roy)ను బరిలోకి దించింది. స్థానికంగా ఈ రాజకుటుంబానికి ఉన్న ప్రాబల్యంతో విజయం సాధించాలని కాషాయ పార్టీ ఆశిస్తోంది.
ఆ రాజు పేరు మీదుగానే కృష్ణానగర్
రాజవంశానికి చెందిన రాజా కృష్ణచంద్ర రాయ్ 18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించారు. తన 55 ఏళ్ల పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. బెంగాలీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించి చరిత్రకెక్కారు. ఆయన రాజ్యపాలన ఇప్పటికీ బెంగాల్ వాసులకు గుర్తుండిపోతుంది. ఆయన పేరు మీదుగానే ఈ ప్రాంతానికి కృష్ణానగర్ అని పేరు పెట్టారు. ఈ వంశానికి చెందిన వ్యక్తే రాజమాత అమృతారాయ్. వీరి కుటుంబానికి స్థానికంగా మంచి పేరుంది.
భాజపా అభ్యర్థిగా ‘సందేశ్ఖాలీ’ బాధితురాలు..
తృణమూల్ కంచుకోట..
కృష్ణానగర్ స్థానంలో తృణమూల్కు గట్టి పట్టు ఉంది. 2009 నుంచి ఇక్కడ ఈ పార్టీనే వరుసగా విజయం సాధిస్తోంది. 2019లో టీఎంసీ నుంచి మహువా మొయిత్రా.. తన సమీప భాజపా అభ్యర్థిపై 60వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత నుంచి భాజపాపై పదునైన విమర్శలతో ఆమె వార్తల్లో నిలిచారు. ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలు రావడంతో గతేడాది ఆమెను లోక్సభ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.
అయినప్పటికీ టీఎంసీ ఆమెకు మరోసారి టికెట్ ఇచ్చింది. ఈసారి బెంగాల్లో వామపక్షాలు పోటీ చేసే అవకాశాలు లేకపోవడంతో కృష్ణానగర్లో మహువా, రాజమాత మధ్య ప్రధాన పోటీ నెలకొననుంది. దీంతో ఈ పోరు ఆసక్తికరంగా మారింది. మరి వీరిలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా, వైకాపా శ్రేణుల ఘర్షణ.. కుంకలగుంటలో పోలీసుల బందోబస్తు
జిల్లాలోని నకరికల్లు మండలం కుంకలగుంటలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. -
సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మద్దతిస్తాం
హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్సింగ్ హుడా చర్యలు చేపడితే తమ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్ చౌటాలా తెలిపారు. -
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. -
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి బరిలో నిలవనున్నారు. -
కాంగ్రెస్లోకి పద్మశ్రీ గ్రహీత గజం గోవర్ధన్
పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అఖిలభారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలం అధ్యక్షుడు గోశిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి నారా నరసింహా, ఆప్కో మాజీ డైరెక్టర్ గోశిక పాండులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి: మహానగర నిర్మాణం కోసం సౌదీ ఆదేశాలు..!
-
ఉద్యోగులకు ఏఐఎక్స్ షాక్.. 25 మంది తొలగింపు.. మిగిలిన వారికి అల్టిమేటం
-
భారత క్రికెట్లో అభిషేక్ ఓ అద్భుతం.. సంచలనాలు సృష్టిస్తాడు: ట్రావిస్ హెడ్
-
షికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం..
-
పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికా ఆరోపణల వేళ భారత్కు రష్యా మద్దతు
-
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!