BJP Candidates List: రాజస్థాన్ బరిలో ఏడుగురు భాజపా ఎంపీలు.. మధ్యప్రదేశ్ సీఎంకు సీటు ఫిక్స్
BJP Candidates List: వచ్చే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు భాజపా పక్కా వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్లో ఎంపీలు, కేంద్రమంత్రులను బరిలోకి దింపగా.. తాజాగా రాజస్థాన్లోనూ ఏడుగురు ఎంపీలకు టికెట్లు ఇచ్చింది
దిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Assembly elections)కు షెడ్యూల్ వెలువడింది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం పోలింగ్ తేదీలను ప్రకటించింది. ఈ క్రమంలోనే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు భాజపా మరో విడత అభ్యర్థుల జాబితా (BJP Candidates List)ను విడుదల చేసింది. రాజస్థాన్లో తొలి జాబితాను విడుదల చేయగా.. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికలకు మరింత మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
వసుంధరా రాజేకు దక్కని చోటు..
రాజస్థాన్ (Rajasthan) అసెంబ్లీ ఎన్నికలకు 41 మంది అభ్యర్థులతో భాజపా సోమవారం తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో ఏడుగురు ఎంపీలకు టికెట్లు కేటాయించింది. జోత్వారా నుంచి ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, విద్యాధర్ నగర్ నుంచి ఎంపీ దియా కుమారి, తిజారా నుంచి ఎంపీ మహంత్ బాలక్నాథ్, సవాయ్ మాధోపూర్ నుంచి రాజ్యసభ ఎంపీ కిరోది లాల్ మీనాను బరిలోకి దింపింది. అయితే, తొలి జాబితాలో మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే పేరు లేకపోవడం గమనార్హం. రాజస్థాన్లో మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
నవంబరు 30న తెలంగాణ ఎన్నికలు.. ఐదు రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదల
బుధ్నీ నుంచే చౌహన్ పోటీ..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ (Shivraj Singh Chouhan) పేరును తొలి రెండు జాబితాల్లో ప్రకటించకపోవడంతో ఇటీవల అనేక ఊహాగానాలు వినిపించాయి. వాటికి చెక్ పెడుతూ తాజా జాబితాలో ఆయన పోటీని భాజపా ఖరారు చేసింది. తన కంచుకోట బుధ్నీ నుంచే చౌహన్ను బరిలోకి దించింది. మధ్యప్రదేశ్ ఎన్నికలకు 57 మందితో భాజపా నేడు మూడో జాబితాను ప్రకటించింది. మధ్యప్రదేశ్లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలుండగా.. తాజా జాబితాలో కలిపి భాజపా ఇప్పటివరకు 135 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
ఛత్తీస్గఢ్లో 64 స్థానాలకు ఖరారు..
ఛత్తీస్గఢ్ (Chhattisgarh) అసెంబ్లీ ఎన్నికలు భాజపా 64 మంది అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసింది. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్.. రాజ్నంద్గావ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలోనూ పలువురు ఎంపీలను పోటీకి దించింది. ఎంపీలు రేణుకా సింగ్, గోమతి సాయ్ ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా.. 90 శాసనసభ నియోజకవర్గాలున్న ఛత్తీస్గఢ్లో భాజపా తొలి విడతలో 21 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 85 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని కోరారు. -
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. -
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
ఎమ్మెల్సీగా ఉన్న తనపై అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్య అని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. -
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అస్వస్థతకు గురయ్యారు. -
ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. -
కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ చేపట్టిన తర్వాత బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య బుధవారం లేఖ రాశారు. -
సీఎం సొంతూరు ఉన్న నియోజకవర్గంలో భారాస నేతలపై దాడులు
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, సీఎం రేవంత్రెడ్డి సొంతూరు ఉన్న అచ్చంపేట నియోజకవర్గంలో భారాస నేతలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. -
వైఫల్యాలను అంగీకరించకుండా ఉద్యోగులపై అభాండాలా?
కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా.. ప్రతిపక్షాలు, విద్యుత్తు ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం
దొడ్డు వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వకపోవడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
మాలీవాల్పై దాడి.. విచారణ జరిపించాలి
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై జరిగిన దాడిపై భాజపా ఆందోలన వ్యక్తం చేసింది. ఈ దాడిపై సమగ్ర విచారణ జరపాలంటూ భాజపా నాయకులు, మహిళా మోర్చా సభ్యులు బుధవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసనకు దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
-
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
-
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?