loksabha polls: కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
ముంబయి: మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ వ్యక్తి ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన భాజపా నేత షెహజాద్ పూనావాలా ఇది కాంగ్రెస్ పార్టీ స్కామ్గా అభివర్ణించారు. ఆ వీడియోను పార్టీ అధికారిక ఎక్స్లో పోస్టు చేస్తూ ఎన్నికల సంఘానికి, షారుఖ్ ఖాన్కు ట్యాగ్ చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిర్మొహమాటంగా, బహిరంగంగా ఎలా మోసం చేస్తుందో చూడండి. నకిలీ సర్వేలు, భారత వ్యతిరేక కథనాలు చేయించారు. ప్రముఖుల డీప్ ఫేక్లను రూపొందించారు. ఇప్పుడేమో ఇలా డూప్లతో ప్రచారం చేయిస్తున్నారు. అలాంటి ఈ పార్టీ ఈవీఎంలను ఎందుకు నిందిస్తుందో మీకు తెలుసు’’ అంటూ ఓ వ్యాఖ్యను జత చేశారు.
కాగా షారుఖ్ఖాన్గా కనిపించే డూప్ పేరు ఇబ్రహీం ఖాద్రీ అని నెటిజన్లు పేర్కొన్నారు. ఆయన షారుఖ్ ను పోలి ఉండడంతో సామాజిక మాధ్యమాలలో అతడికి అనేకమంది ఫాలోవర్లు ఉన్నారని తెలిపారు. వైరల్ అవుతున్న వీడియోలో షారుఖ్లా కనిపించే ఇబ్రహీం ఖాద్రీ షోలాపూర్ అభ్యర్థి ప్రణితి షిండే ఫొటోలతో ముస్తాబు చేసిన ప్రచార వాహనంపై నిల్చొని, తన పోనీటైల్ను సవరించుకుంటూ, ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్నారు.
ప్రణితి షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె. షోలాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆమె లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. ఇక్కడ మూడో దశలో మే 7న ఎన్నికలు జరగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?