LS Polls: ఆయన సినిమాలపై నిషేధం విధించండి.. ‘ఈసీ’కి భాజపా లేఖ
లోక్సభ ఎన్నికల వేళ ప్రముఖ నటుడు శివరాజ్కుమార్ సినిమాలు, ప్రకటనలు, హోర్డింగ్లపై నిషేధం విధించాలని కోరుతూ భాజపా శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆశ్రయించింది.
బెంగళూరు: కన్నడనాట లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారం జోరందుకుంది. 2019లో రాష్ట్రంలోని 28 స్థానాల్లో 25 సీట్లను గెలుచుకున్న భాజపా (BJP).. ఈసారి కూడా జైత్రయాత్ర కొనసాగించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల వేళ ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్కుమార్ (Shivarajkumar) సినిమాలు, ప్రకటనలు, హోర్డింగ్లపై నిషేధం విధించాలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆశ్రయించింది. ఆయన సతీమణి గీతా శివరాజ్కుమార్ శివమొగ్గలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న విషయం తెలిసిందే.
‘‘శివరాజ్కుమార్ రాష్ట్రంలో ప్రజాదరణ కలిగిన వ్యక్తి. ప్రస్తుతం కాంగ్రెస్ కోసం రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. తనదైన ప్రజావ్యక్తిత్వం, నటించిన సినిమాల ద్వారా ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపగలరు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే ఆయన హక్కును గౌరవిస్తున్నప్పటికీ.. ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాల వేదిక కల్పించాలి. అనవసరమైన ప్రయోజనాలు, ప్రభావాలను అరికట్టడం అవసరం’’ అని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ నేత ఆర్.రఘు పేర్కొన్నారు.
విరుదునగర్లో ఆసక్తికరపోరు.. నటి రాధికకు పోటీగా ‘కెప్టెన్’ తనయుడు
కోడ్ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు ముగిసేవరకు శివరాజ్కుమార్ సినిమాలు, ప్రకటనలు, హోర్డింగ్లను ప్రదర్శించకుండా సినిమా హాళ్లు, టీవీ ఛానెల్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ లేఖను పరిశీలిస్తున్నట్లు కర్ణాటక సీఈవో మనోజ్ కుమార్ మీనా ‘పీటీఐ’ వార్తాసంస్థకు చెప్పారు. ఇదిలాఉండగా.. శివరాజ్కుమార్ నటించిన చివరి కన్నడ చిత్రం ‘కరటక దమనక’ మార్చి 8న విడుదలైంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న రామ్చరణ్ సినిమాలోనూ కీలకపాత్ర పోషించనున్నారు. శివమొగ్గలో భాజపా నుంచి మాజీ సీఎం యడియూరప్ప తనయుడు, సిట్టింగ్ ఎంపీ బీవై రాఘవేంద్ర పోటీ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..