BRS: హైదరాబాద్ లోక్సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన భారాస
పెండింగులో ఉన్న హైదరాబాద్ లోక్సభ స్థానానికి భారాస (BRS) అభ్యర్థిని ప్రకటించింది.
హైదరాబాద్: పెండింగులో ఉన్న హైదరాబాద్ లోక్సభ స్థానానికి భారాస (BRS) అభ్యర్థిని ప్రకటించింది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ను బరిలోకి దించనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ వెల్లడించారు. ఈ మేరకు భారాస ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే పలు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ.. హైదరాబాద్ స్థానాన్ని మాత్రం పెండింగులో ఉంచింది. నేడు శ్రీనివాస్ యాదవ్ను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో భారాస అభ్యర్థుల ప్రకటన పూర్తయినట్లయింది.
భారాస అభ్యర్థులు వీళ్లే..
- సికింద్రాబాద్ - పద్మారావుగౌడ్
- కరీంనగర్ - వినోద్కుమార్
- పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్
- ఖమ్మం - నామా నాగేశ్వరరావు
- మహబూబాబాద్ - మాలోత్ కవిత
- చేవెళ్ల - కాసాని జ్ఞానేశ్వర్
- వరంగల్ - డాక్టర్ కడియం కావ్య
- జహీరాబాద్ - అనిల్కుమార్
- నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్
- నాగర్కర్నూల్ - ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
- మెదక్ - వెంకట్రామిరెడ్డి
- మహబూబ్నగర్ - మన్నె శ్రీనివాస్రెడ్డి
- మల్కాజిగిరి - రాగిడి లక్ష్మారెడ్డి
- ఆదిలాబాద్ - ఆత్రం సక్కు
- భువనగిరి- క్యామ మల్లేశ్
- నల్గొండ - కంచర్ల కృష్ణారెడ్డి
- హైదరాబాద్- గడ్డం శ్రీనివాస్ యాదవ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇతర నేతల అంతమే మోదీ లక్ష్యం
తిహాడ్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రధాని మోదీతో చర్చకు సిద్ధమే
లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో బహిరంగ చర్చ నిర్వహించాలన్న విశ్రాంత న్యాయమూర్తుల చొరవను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. -
విపక్ష నేతలకు రాసిన లేఖపై మీరు స్పందించడం ఆశ్చర్యమే
సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల్లో నమోదైన పోలింగ్ శాతాల వెల్లడిలో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలకు తాను రాసిన లేఖపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
కేజ్రీవాల్, సిసోదియా వంటి వారిని భాజపా ఆహ్వానించదు
తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్ వంటి నేతలను భాజపాలోకి ఎప్పటికీ ఆహ్వానించబోమని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ స్పష్టం చేశారు. -
వరుణ్కు టికెట్ ఇస్తే బాగుండేది: మేనకా గాంధీ
యూపీలోని పీలీభీత్ లోక్సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేసేందుకు తన కుమారుడు వరుణ్ గాంధీకి భాజపా అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన తల్లి మేనకా గాంధీ పేర్కొన్నారు. -
పోలింగ్ ముగియగానే విలేకర్ల సమావేశం నిర్వహించండి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ప్రతి విడత పోలింగ్ ముగిశాక అదే రోజు విలేకర్ల సమావేశం నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్ తదితర మీడియా సంఘాలు డిమాండ్ చేశాయి. -
‘టెంపో’ బిలియనీర్ల తోలుబొమ్మ మోదీ
‘టెంపో బిలియనీర్ల’ చేతిలో తోలుబొమ్మలాంటి 21వ శతాబ్దపు రాజు ప్రధాని నరేంద్రమోదీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు.