BRS: హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన భారాస

పెండింగులో ఉన్న హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి భారాస (BRS) అభ్యర్థిని ప్రకటించింది.

Updated : 25 Mar 2024 11:58 IST

హైదరాబాద్‌: పెండింగులో ఉన్న హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి భారాస (BRS) అభ్యర్థిని ప్రకటించింది. గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ను బరిలోకి దించనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ వెల్లడించారు. ఈ మేరకు భారాస ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే పలు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ.. హైదరాబాద్‌ స్థానాన్ని మాత్రం పెండింగులో ఉంచింది. నేడు శ్రీనివాస్‌ యాదవ్‌ను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో భారాస అభ్యర్థుల ప్రకటన పూర్తయినట్లయింది.

భారాస అభ్యర్థులు వీళ్లే..

  • సికింద్రాబాద్‌ - పద్మారావుగౌడ్‌
  • కరీంనగర్‌ - వినోద్‌కుమార్‌
  • పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్‌
  • ఖమ్మం - నామా నాగేశ్వరరావు
  • మహబూబాబాద్‌ - మాలోత్‌ కవిత
  • చేవెళ్ల - కాసాని జ్ఞానేశ్వర్
  • వరంగల్‌ - డాక్టర్ కడియం కావ్య
  • జహీరాబాద్‌ - అనిల్‌కుమార్‌
  • నిజామాబాద్‌ - బాజిరెడ్డి గోవర్ధన్‌
  • నాగర్‌కర్నూల్‌ - ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
  • మెదక్‌ - వెంకట్రామిరెడ్డి
  • మహబూబ్‌నగర్‌ - మన్నె శ్రీనివాస్‌రెడ్డి
  • మల్కాజిగిరి - రాగిడి లక్ష్మారెడ్డి
  • ఆదిలాబాద్‌ - ఆత్రం సక్కు
  • భువనగిరి- క్యామ మల్లేశ్‌
  • నల్గొండ - కంచర్ల కృష్ణారెడ్డి 
  • హైదరాబాద్‌- గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని