Harishrao: పీర్జాదిగూడ మేయర్‌, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్‌ యత్నం: హరీశ్‌రావు

పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఎలాగైనాసరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్‌ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

Updated : 19 May 2024 22:15 IST

హైదరాబాద్‌: పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఎలాగైనాసరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్‌ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. భారాస మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్‌ చేయడానికి కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. కార్పొరేటర్లపై దాడిని ‘ఎక్స్‌’ వేదికగా ఖండించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డుపై 20 కార్లతో మేయర్‌, కార్పొరేటర్లను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తు్న్నారన్నారు. డీజీపీ రాచకొండ కమిషనర్‌ వెంటనే పీర్జాదిగూడ మేయర్‌, కార్పొరేటర్లకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఇలా దాడులకు పాల్పడటం గర్హనీయమని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని