Harish Rao: ఉద్యోగాలిస్తామని భాజపా మోసం చేసింది: హరీశ్రావు
భాజపా ప్రజలకు ఏం చేసిందో ప్రశ్నించాలని భారాస కార్యకర్తలకు ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.
వికారాబాద్: ప్రజలకు భాజపా ఏం చేసిందో ప్రశ్నించాలని భారాస కార్యకర్తలకు ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆకలి, నిరుద్యోగం, పేదరికం అన్నీ పెరుగుతున్నాయి. భాజపా ప్రభుత్వం జీఎస్టీ వేసి ధరలు పెంచింది. పెరిగిన ధరలతో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదు. ఉద్యోగాలిస్తామని నిరుద్యోగ యువతను భాజపా మోసం చేసింది. చెప్పుకోవడానికి ఆ పార్టీకి పథకాలే లేవు’’అని భాజపాపై హరీశ్రావు ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!