MLA Rajaiah: టికెటూ నాకే.. గెలుపూ నాదే: ఎమ్మెల్యే రాజయ్య

భారాస పార్టీ తరఫున ఈసారి టికెట్ ఖాయమని.. మళ్లీ గెలుపు కూడా తనదేనని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లోని  క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 04 May 2023 15:10 IST

స్టేషన్ ఘన్‌పూర్: భారాస పార్టీ తరఫున ఈసారి టికెట్ ఖాయమని.. మళ్లీ గెలుపు కూడా తనదేనని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు రూమర్లేనని రాజయ్య కొట్టిపారేశారు. ఆ వార్తలకు కార్యకర్తలు ఎవరూ కంగారు పడొద్దని.. అయోమయానికి గురి కావొద్దని సూచించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో మాజీ మంత్రి కడియం శ్రీహరితో విభేదాల నేపథ్యంలో రాజయ్య తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్‌కు వీర విధేయుడుగా ఉన్నట్లు రాజయ్య తెలిపారు. పని చేసుకుంటూ పోతే అధినాయకుడి వద్ద గుర్తింపు ఉంటుందని చెప్పారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. శుక్రవారం హనుమకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలకాలని.. సాయంత్రం జరిగే బహిరంగ సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని