Kavitha: నా ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించారు: ఎమ్మెల్సీ కవిత
దిల్లీ మద్యం కేసులో తాను బాధితురాలినని.. దీనితో ఎలాంటి సంబంధం లేదని భారాస (BRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha) అన్నారు.
దిల్లీ: దిల్లీ మద్యం కేసులో తాను బాధితురాలినని.. దీనితో ఎలాంటి సంబంధం లేదని భారాస (BRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha) అన్నారు. దర్యాప్తు సంస్థలు పేర్కొన్నట్లు ఆర్థికంగా ఏ లబ్ధీ చేకూరలేదని చెప్పారు. జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఈడీ అధికారులు ఆమెను కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సమయంలో మీడియాతో కవిత పలు వ్యాఖ్యలు చేశారు.
‘‘సీబీఐ, ఈడీ దర్యాప్తు కంటే మీడియాలో విచారణ ఎక్కువగా జరిగింది. రాజకీయంగా, వ్యక్తిగతంగా నా ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించారు. ఫోన్ నంబర్ను ఛానళ్లలో ప్రసారం చేసి గోప్యతను దెబ్బతీశారు. దిల్లీ మద్యం కేసులో నాలుగుసార్లు విచారణకు హాజరయ్యా. బ్యాంకు వివరాలు కూడా ఇచ్చి అన్ని విధాలుగా సహకరించా. నా మొబైల్ ఫోన్లన్నీ దర్యాప్తు సంస్థకు అందజేశా. ఫోన్లు ధ్వంసం చేశానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రెండున్నరేళ్లుగా సోదాలు జరిపారు.. వేధింపులకు గురిచేశారు.
సాక్షులను బెదిరిస్తున్నట్లు నాపై ఆరోపణలు చేస్తున్నారు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు. 95 శాతం కేసులన్నీ ప్రతిపక్ష నేతలకు సంబంధించినవే. భాజపాలో చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతోంది. విపక్ష పార్టీలన్నీ న్యాయవ్యవస్థ వైపు ఆశతో చూస్తున్నాయి. కేసు దర్యాప్తునకు సహకరించేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నా’’ అని కవిత అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM