Chandrababu: ఏపీలో కూటమికి 160కిపైగా అసెంబ్లీ సీట్లు వస్తాయి : చంద్రబాబు
ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
విజయవాడ : ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కసరత్తు చేశామని చెప్పారు. సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం ఉండదన్నారు. తెదేపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు విజయవాడలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన, భాజపా నేతలు కూడా హాజరయ్యారు. ఇందులో చంద్రబాబు పాల్గొని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.
‘‘ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రౌడీయిజం, అధికార దుర్వినియోగం కనబడుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నాం. పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్. పొత్తులో భాగంగా 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయాం. వాళ్లు చేసిన త్యాగం నేనెప్పుడూ మరచిపోను. సీట్లు రాని అభ్యర్థుల బాగోగులు మేం చూసుకుంటాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అవకాశం కల్పిస్తాం. మూడు పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేశాం. నిలబెట్టిన అభ్యర్థి గెలవాలనేదే కూటమి లక్ష్యం’’
‘‘ఎన్డీయే కేంద్రంలో 400కుపైగా లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుంది. రాష్ట్రంలో కూటమికి 160కిపైగా అసెంబ్లీ సీట్లు వస్తాయి. కడప ఎంపీ సీటును మనమే గెలవబోతున్నాం. ఆ పార్టీ అభ్యర్థి.. ఈ పార్టీ అభ్యర్థి అని చూడొద్దు. అందరూ ఎన్డీయే అభ్యర్థులుగానే భావించాలి. మూడు పార్టీలు వేసే పునాది.. 30 ఏళ్ల భవిష్యత్తుకు నాంది పలకాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
‘‘ఐదేళ్లలో జగన్ ఇంత ఘోరంగా రాజకీయాలు చేస్తారనుకోలేదు. ఇలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి వేధించడం మొదలుపెట్టారు. అబద్ధాలు చెప్పి మరోసారి గెలవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. విశాఖలో కంటెయినర్ దొరికితే తెదేపాపై విమర్శలు చేస్తారా? బ్రెజిల్ అధ్యక్షుడు ఎన్నిక కాగానే విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. డ్రగ్స్ మాఫియాను పెంచి పొషించిందెవరో అందరికీ తెలుసు. చేసేది, చేయించేది వైకాపా’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం