Chandrababu: ఐఏఎస్‌ల కన్ఫర్మేషన్‌ ప్రక్రియ వాయిదా వేయాలి: చంద్రబాబు

ఐఏఎస్‌ కన్ఫర్మేషన్‌ ప్రక్రియ వాయిదా వేయాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు యూపీఎస్సీకి లేఖ రాశారు.

Updated : 24 May 2024 15:26 IST

అమరావతి: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఐఏఎస్‌ కన్ఫర్మేషన్‌ ప్రక్రియను వాయిదా వేయాలని యూపీఎస్సీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఐఏఎస్‌కు రాష్ట్ర క్యాడర్‌ ఆఫీసర్ల ఎంపిక కార్యక్రమాన్ని మోడల్‌ కోడ్‌ ఉన్నప్పుడు చేయడం సముచితం కాదని లేఖలో పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు వాయిదా వేయాలని కోరారు. సీఎంవోలోని వారికే పదోన్నతులు పరిమితం చేశారని ఆరోపించారు. కన్ఫర్మేషన్‌ జాబితా తయారీలో పారదర్శకత లేదని, పునఃపరిశీలించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని