Chandrababu: తెదేపా ఎంపీలతో సమావేశం కానున్న చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం జరిగే ఎన్డీయే సమావేశంలో పాల్గొననున్నారు.

Updated : 06 Jun 2024 12:18 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం జరిగే ఎన్డీయే సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్ర మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్న నేపథ్యంలో గురువారం పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని నివాసానికి రావాలని వారికి సూచించారు. మోదీ ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని ఇప్పటికే తెదేపా ఎంపీలకు ఆహ్వానాలు అందాయి. లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా 16 ఎంపీ స్థానాలు గెలుచుకొని ఎన్డీయే కూటమిలో కీలకంగా మారింది. మరోవైపు చంద్రబాబు ఇంటి వద్ద భద్రత పెంచారు. ఇద్దరు గుంటూరు జిల్లా ఏఎస్పీల ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. చంద్రబాబును కలిసేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు తరలివస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని