Chandrababu: నేడే చంద్రబాబు ప్రమాణ స్వీకారం
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు మంగళవారం సాయంత్రానికి పూర్తయ్యాయి. కృష్ణా జిల్లా కేసరపల్లిలో సభాప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
ముస్తాబైన వేదిక
ప్రముఖుల రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత
60 మందికిపైగా ఐపీఎస్ల పర్యవేక్షణ
దారులన్నీ కేసరపల్లికే..!
ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదిక
ఈనాడు, ఈనాడు డిజిటల్ - అమరావతి, న్యూస్టుడే, గన్నవరం గ్రామీణం: చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు మంగళవారం సాయంత్రానికి పూర్తయ్యాయి. కృష్ణా జిల్లా కేసరపల్లిలో సభాప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి బుధవారం ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, అగ్రనటులు చిరంజీవి, రజనీకాంత్ తదితరులు వస్తుండడంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. గన్నవరం మండలం కేసరపల్లిలో సభ కోసం 11.18 ఎకరాలను సిద్ధం చేశారు. 36 గ్యాలరీల్లో అందరికీ వేదిక కనిపించేలా ఎల్ఈడీ తెరలను ఏర్పాటుచేశారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా నాలుగు గ్యాలరీలు సిద్ధం చేశారు.
ఐదు చోట్ల పార్కింగ్ ప్రదేశాలు
వాహనాల పార్కింగ్ కోసం వివిధ చోట్ల 56 ఎకరాలను కేటాయించారు. విజయవాడ వైపు నుంచి వచ్చే వాటి కోసం ముస్తాబాద రోడ్డులో ఎస్ఎల్వీ సమీపంలోని పార్కింగ్ ఇచ్చారు. ఈ ప్రాంతం సభా వేదికకు 1.5 కి.మీ దూరం. అక్కడి నుంచి కాలినడకన సభా ప్రాంగణానికి చేరుకోవాలి. వేదిక నుంచి 700 మీటర్ల దూరంలోని ఎలైట్ విస్టా వద్ద రెండో పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు. ఏలూరు వైపు నుంచి వచ్చే వారికి ఏర్పాటుచేసిన పార్కింగ్.. వేదికకు 730 మీటర్ల దూరంలో ఉంది. మేధా టవర్స్ వద్ద వేదికకు 300 మీటర్ల దూరంలో ప్రముఖుల కోసం మరో పార్కింగ్ప్రదేశాన్ని ఉద్దేశించారు.
గన్నవరం విమానాశ్రయం వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు
భద్రతా దళాల గుప్పిట ప్రాంగణం
కార్యక్రమానికి అత్యంత ప్రముఖులు తరలివస్తుండడంతో పోలీసులు భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 10వేల మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. విజయవాడకు 3వేల మంది పోలీసులను కేటాయించారు. గన్నవరం విమానాశ్రయం, పరిసర ప్రాంతాలు, కేసరపల్లి సభా ప్రాంగణం లోపల, వెలుపల 7వేల మందికి రక్షణ విధులు అప్పగించారు. 60మంది పైగా ఐపీఎస్ అధికారులను నియమించారు. డీజీ హోదా మొదలు ఎస్పీ ర్యాంకు వరకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడుగా ట్రైనీ ఐపీఎస్లూ వచ్చారు. వీవీఐపీల వాహనశ్రేణి నేరుగా వేదిక వచ్చేందుకు వీలుగా ప్రత్యేక బీటీ రోడ్లను నిర్మించారు. ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
పాస్లు ఉంటేనే జాతీయ రహదారిపైకి అనుమతి
ప్రాంగణం పక్కనే ఉన్న జాతీయరహదారిపై ట్రాఫిక్జామ్ కాకుండా పోలీసులు చర్యలు ప్రారంభించారు. కార్యక్రమానికి పాస్లు ఉన్నవారినే చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపైకి అనుమతించనున్నారు. పాస్లు లేనివారిని రోడ్లపైకి అనుమతించబోమని విజయవాడ పోలీసు కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ చెబుతున్నారు. సభకు వచ్చేవారు లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి లేదని, వాహనాల్లో ఉంచి ప్రాంగణంలోకి రావాలని పోలీసులు కోరుతున్నారు.
బెంగళూరు పూలతో వేదిక
వేదికను అందంగా అలంకరించే బాధ్యతను ఉద్యానశాఖకు అప్పగించారు. భారీగా ఏర్పాటుచేసిన వేదిక అందంగా కనిపించేందుకు ప్రత్యేకంగా వివిధ రకాల పూలను బెంగళూరు నుంచి తెప్పించారు. వేదికతో పాటు వీవీఐపీల విశ్రాంతి గదులనూ పూలతో అలంకరించారు.
సైకిల్పై కదిరి నుంచి..
చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం హిందూపురం జిల్లా కదిరి నుంచి 480 కి.మీ. మేర సైకిల్పై తెదేపా కార్యకర్త సతీష్ కేసరపల్లి వచ్చాడు. ఈ నెల 8న కదిరిలో బయలుదేరిన సతీష్, మంగళవారం మధ్యాహ్నం సభాప్రాంగణానికి చేరుకున్నారు. ‘వైకాపా పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలే. ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టుచేసి జైలుకు తరలించినప్పుడు కదిరి నుంచి సైకిల్పై వెళ్లాను. ఐదేళ్ల అరాచక వైకాపాను గద్దె దింపిన తెదేపా అధినేత.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని సైకిల్పై వచ్చాను’ అని సతీష్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?