Chandrababu: తెదేపా ఏజెంట్‌ శేషగిరిరావుకు చంద్రబాబు ఫోన్‌.. అండగా ఉంటామని భరోసా

పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రం ఘటనలో బాధితుడు నంబూరి శేషగిరిరావుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాట్లాడారు. 

Published : 22 May 2024 17:33 IST

అమరావతి: మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రం ఘటనలో బాధితుడు నంబూరి శేషగిరిరావుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాట్లాడారు. శేషగిరిరావు ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలింగ్‌ రోజు పాల్వాయిగేటు పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేసిన  వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లిని శేషగిరిరావు ధైర్యంగా ప్రశ్నించారు. ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన అతనిపై ఎమ్మెల్యే అనుచరులు మారణాయుధాలతో దాడి చేశారు. తాజాగా ఈవీఎం ధ్వంసం ఘటనలో ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడంతో శేషగిరిరావు అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. ఎమ్మెల్యే అక్రమాలను ధైర్యంగా ప్రశ్నించిన శేషగిరిరావుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు