Chandrababu: వెంటనే పింఛన్లు ఇవ్వాలి..సీఈవో, సీఎస్‌కు చంద్రబాబు ఫోన్‌

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌ చేశారు.

Updated : 02 Apr 2024 13:23 IST

అమరావతి : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌ చేశారు. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పింఛన్ల పంపిణీకి ఈసీ ఎలాంటి ఆంక్షలూ విధించలేదని.. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే అందించాలని సూచించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వెంటనే పింఛన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వేసవి ఎండల్లో వృద్ధులు ఇబ్బందిపడకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని