Chandrababu: రెండో విడత ‘ప్రజాగళం’ .. చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌ ఖరారు

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం పర్యటనలకు రెండో విడత షెడ్యూల్‌ ఖరారైంది.

Published : 02 Apr 2024 18:57 IST

అమరావతి: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం పర్యటనలకు రెండో విడత షెడ్యూల్‌ ఖరారైంది. బుధవారం నుంచి ఐదు రోజుల పాటు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఏప్రిల్‌ 3న కొత్తపేట, రామచంద్రాపురం, 4న కొవ్వూరు, గోపాలపురంలో రోడ్‌షోలో పాల్గొంటారు. 5న నరసాపురం, పాలకొల్లు, 6న పెదకూరపాడు, సత్తెనపల్లి, 7న పామర్రు, పెనమలూరులో ప్రజాగళం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి రోజు సాయంత్రం 4గంటలకు తొలి సమావేశం, 6గంటలకు రెండో సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. తొలివిడతలో 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్‌ షోల్లో చంద్రబాబు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని