Chandrababu: నా భద్రతపై అనుమానాలున్నాయ్‌: ఏసీబీ కోర్టుకు తెలిపిన చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది.

Updated : 19 Oct 2023 14:35 IST

విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టైన తెదేపా అధినేత చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్‌ నేటితో ముగియడంతో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌ను నవంబర్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. 

జైలులో తన భద్రత విషయంలో అనుమానాలున్నాయని చంద్రబాబు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనుమానాలుంటే రాత పూర్వకంగా ఇవ్వాలని ఆయనకు జడ్జి సూచించారు. చంద్రబాబు రాసే లేఖను తనకు అందివ్వాలని జైలు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్యంపై జడ్జి ఆరా తీశారు. ఆయన మెడికల్‌ రిపోర్టులను అందివ్వాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని