Chandrababu: 20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు

ఒక్క డీఎస్సీ కూడా పెట్టకుండా జగన్‌.. యువత భవిష్యత్తు నాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 

Published : 19 Apr 2024 21:31 IST

రాయదుర్గం: ఒక్క డీఎస్సీ కూడా పెట్టకుండా జగన్‌.. యువత భవిష్యత్తు నాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మెగా డీఎస్సీపైనే తొలి సతకం పెడతానని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని కణేకల్‌ ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు.

‘‘ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. యువత కోసం నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాం. పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాం. వాలంటీర్లను కాపాడుకునే బాధ్యత నాది.. రాజీనామా చేయొద్దని కోరుతున్నా. వాలంటీర్ల వేతనాన్ని రూ.10వేలకు పెంచుతాం. రైతులకు ఏడాదికి రూ.20వేలు ఇస్తాం’’ అని చంద్రబాబు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని