Chandrababu: తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్‌లు ఇవ్వనున్న చంద్రబాబు

తెలుగుదేశం అభ్యర్థులకు అధినేత చంద్రబాబు ఈనెల 21న బీఫామ్‌లు అందజేయనున్నారు. 

Published : 18 Apr 2024 17:03 IST

అమరావతి: తెలుగుదేశం అభ్యర్థులకు అధినేత చంద్రబాబు ఈనెల 21న బీఫామ్‌లు అందజేయనున్నారు. పార్టీ జోనల్‌ ఇన్‌ఛార్జిలతో నిర్వహించిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. జోనల్‌ ఇన్‌ఛార్జిల ద్వారా తొలుత బీఫామ్‌లు ఇప్పించాలని భావించినప్పటికీ.. అభ్యర్థులు సెంటిమెంట్‌గా భావిస్తారనే సూచన మేరకు నిర్ణయం మార్చినట్టు సమాచారం. మొత్తం 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ అభ్యర్థులకు తన చేతులమీదుగా బీఫామ్‌లను చంద్రబాబు ఇవ్వనున్నారు.  

అధినేతతో గురువారం జరిగిన సమావేశంలో జోనల్ ఇన్ఛార్జిలు దామచర్ల సత్య, సుజయ్ కృష్ణ రంగారావు, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి, మంతెన సత్యనారాయణ రాజు, బీదా రవిచంద్ర యాదవ్, బొబ్బిలి చిరంజీవి, యనమదల రవి, దీపక్ రెడ్డి, కోవెలమూడి నాని పాల్గొన్నారు. అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత జోనల్ ఇన్ఛార్జిలు తీసుకోవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని