Chandrababu: తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
తెలుగుదేశం అభ్యర్థులకు అధినేత చంద్రబాబు ఈనెల 21న బీఫామ్లు అందజేయనున్నారు.
అమరావతి: తెలుగుదేశం అభ్యర్థులకు అధినేత చంద్రబాబు ఈనెల 21న బీఫామ్లు అందజేయనున్నారు. పార్టీ జోనల్ ఇన్ఛార్జిలతో నిర్వహించిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. జోనల్ ఇన్ఛార్జిల ద్వారా తొలుత బీఫామ్లు ఇప్పించాలని భావించినప్పటికీ.. అభ్యర్థులు సెంటిమెంట్గా భావిస్తారనే సూచన మేరకు నిర్ణయం మార్చినట్టు సమాచారం. మొత్తం 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ అభ్యర్థులకు తన చేతులమీదుగా బీఫామ్లను చంద్రబాబు ఇవ్వనున్నారు.
అధినేతతో గురువారం జరిగిన సమావేశంలో జోనల్ ఇన్ఛార్జిలు దామచర్ల సత్య, సుజయ్ కృష్ణ రంగారావు, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి, మంతెన సత్యనారాయణ రాజు, బీదా రవిచంద్ర యాదవ్, బొబ్బిలి చిరంజీవి, యనమదల రవి, దీపక్ రెడ్డి, కోవెలమూడి నాని పాల్గొన్నారు. అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత జోనల్ ఇన్ఛార్జిలు తీసుకోవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చారిత్రాత్మక దినం మేడే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
-
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
-
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
-
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?