Chandra babu: రాష్ట్రానికి మంచి జరగాలని చర్చిల్లో ప్రార్థనలు చేయండి: చంద్రబాబు

మానవ ప్రయత్నానికి దేవుడి ఆశీస్సులు కావాలని.. అప్పుడే సంకల్పం నెరవేరుతుందని తెలుగుదేశం (TDP) అధినేత చంద్రబాబు (Chandra babu) నాయుడు అన్నారు.

Published : 21 Dec 2023 22:37 IST

అమరావతి: మానవ ప్రయత్నానికి దేవుడి ఆశీస్సులు కావాలని.. అప్పుడే సంకల్పం నెరవేరుతుందని తెలుగుదేశం (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandra babu) అన్నారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కేక్‌ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. మళ్లీ రాష్ట్రానికి మంచి జరిగేలా చంద్రబాబును దేవుడు అనుగ్రహిస్తాడని మతపెద్దలు దీవెనలు అందించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. క్రైస్తవులు జెరూసలేం వెళ్లేందుకు తమ ప్రభుత్వంలో రూ.50వేల ఆర్థిక సాయం అందించామని గుర్తు చేశారు. క్రిస్మస్‌ రోజు పేదలు కూడా పండుగ చేసుకోవాలని క్రిస్మస్‌ కానుకలు ఇచ్చామన్నారు. దేశంలో పేదరికం లేని సమాజం చూడాలనేది తన ఆకాంక్ష అని, అందుకోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటూ చర్చిల్లో ప్రార్థనలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని