Congress: తుది దశకు టీఎంసీ, ఆప్తో చర్చలు.. సీట్ల సర్దుబాటు కొలిక్కి!
లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కలిసి పోటీ చేసే అంశంపై తృణమూల్ (TMC), ఆప్ (AAP)తో చేస్తున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
దిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కలిసి పోటీ చేసే అంశంపై తృణమూల్ కాంగ్రెస్ (TMC), ఆప్ (AAP)తో చేస్తున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని కాంగ్రెస్ వెల్లడించింది. త్వరలోనే ఇవి ఖరారు కానున్నాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో ఓ అవగాహన కుదిరిన వేళ.. ఇతర రాష్ట్రాల్లోనూ భాగస్వామ్య పక్షాలతోనూ సంప్రదింపులను కాంగ్రెస్ ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
సీట్ల సర్దుబాటు అంశంపై అరవింద్ కేజ్రీవాల్తో చేస్తోన్న చర్చలు దాదాపు పూర్తయినట్లేనని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే దిల్లీ, గుజరాత్లలో పోటీపై అవగాహన కుదిరినట్లు తెలిపాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్తో మాత్రం సంప్రదింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నాయి. ఇండియా కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటును అగ్రనాయకత్వం త్వరలోనే పూర్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.
అస్సాంలో రెండు లోక్సభ స్థానాలు, మేఘాలయాలో ఒక చోట పోటీ చేసేందుకు తృణమూల్ ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. అయితే, మేఘాలయ సీటును వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని.. దీనిపై సుదీర్ఘ మంతనాలు చేస్తున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.