Ravneet Singh Bittu: భాజపాలో చేరిన కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టూ
లోక్సభ ఎన్నికల వేళ పంజాబ్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది. ఆ పార్టీ లుధియానా ఎంపీ రవ్నీత్సింగ్ బిట్టూ భాజపాలో చేరారు.
దిల్లీ: లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ రాజకీయ నేతల వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ మనమడు రవ్నీత్ సింగ్ బిట్టూ(Ravneet singh bittu) భాజపాలో చేరారు. మూడు సార్లు వరుసగా ఎంపీగా గెలిచిన బిట్టూ ప్రస్తుతం లుధియానా నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తమ పార్టీలో చేరేందుకు వచ్చిన బిట్టూకు కమలనాథులు సాదరస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకొనేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
తన చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను బిట్టూ పొగడ్తల్లో ముంచెత్తారు. పంజాబ్ పట్ల ప్రేమ చూపడంతో పాటు రాష్ట్రానికి ఎంతో చేయాలని చూస్తున్న వారిలో ఈ నేతలిద్దరూ ఉన్నారన్నారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో భాజపాను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. పంజాబ్లో రైతులు, కార్మికులు, పరిశ్రమలకు మధ్య వారధిలా ఉండేలా కృషిచేస్తామన్నారు. పంజాబ్లో ఉగ్రవాదం ఉన్న చీకటి రోజుల్ని గుర్తు చేసుకున్న బిట్టూ.. శాంతి స్థాపన కోసం భాజపా, ఆరెస్సెస్ నిర్వహించిన పాత్రను కొనియాడారు. భాజపా ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మాట్లాడుతూ.. బిట్టూ చేరికతో తమ పార్టీ బలపడుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!