Congress: తప్పుడు హామీల పత్రం.. భాజపా మేనిఫెస్టోపై కాంగ్రెస్ విమర్శలు
Congress: భాజపా ఆదివారం విడుదల చేసిన లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది.
దిల్లీ: భాజపా లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను (BJP Manifesto) తప్పుడు హామీల పత్రంగా కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. గతంలో ఇచ్చిన హామీలనే ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని ఆరోపించింది. తాజాగా ‘సంకల్ప పత్ర’లో పేర్కొన్న గ్యారెంటీలన్నీ మోదీ తప్పుడు హామీలకు వారెంటీలని కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు.
ఉద్యోగ కల్పన, రైతుల ఆదాయ రెట్టింపు, ధరల పెరుగుదల కట్టడి వంటి హామీలను మోదీ నెరవేర్చలేదని ఖర్గే తెలిపారు. పైగా వీటన్నింటినీ 2047కు వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. గత పదేళ్ల పాలనలో యువత, రైతులు సహా దేశ ప్రజల ప్రయోజనాల కోసం మోదీ (PM Modi) ఏమీ చేయలేదని విమర్శించారు. యువత ఉపాధి అవకాశాల కోసం ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. వీటి పరిష్కారంపై భాజపా మేనిఫెస్టోలో (BJP Manifesto) ఒక్క హామీ లేదని ఆరోపించారు.
భాజపా మేనిఫెస్టో విడుదల.. కీలకాంశాలివే..
2014 మేనిఫెస్టోలో నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని మోదీ హామీ ఇచ్చారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా అన్నారు. కానీ, చివరకు ఎన్నికల బాండ్లను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఈశాన్య భారత్లో భద్రతను కట్టుదిట్టం చేస్తామని భాజపా హామీ ఇచ్చిందని.. కానీ, అక్కడ ప్రస్తుతం హింస చెలరేగుతోందన్నారు. 100 జిల్లాల్లో పేదరికాన్ని పూర్తిగా తొలగిస్తామన్న గత హామీని పూర్తిగా విస్మరించారన్నారు. ‘ప్రపంచ ఆకలి సూచీ’లో భారత్ స్థానమే అందుకు నిదర్శనమన్నారు. ఈ నేపథ్యంలో భాజపా తప్పుడు హామీలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు.
ఎలాంటి సంప్రదింపులు లేకుండా కేవలం 13 రోజుల్లోనే భాజపా మేనిఫెస్టోను రూపొందించిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిందనే వాదనలో వాస్తవం లేదన్నారు. భాజపా తప్పుడు హామీలతో ప్రజలు విసిగి పోయారని.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారని చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
కడప జిల్లా వేంపల్లి మండలం కుమ్మరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి చేదు అనుభవం ఎదురైంది. -
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!