AP Election Results: ‘వివేకం’ ప్రదర్శించిన ఓటర్లు
మాజీ మంత్రి వివేకా హత్య... రెండు ఎన్నికలపై ప్రభావం చూపించింది. 2019 ఎన్నికల సమయంలో హత్య జరగడంతో జగన్... ఈ నేరాన్ని అప్పటి అధికార పక్షమైన తెదేపాపైకి నెట్టేసి ‘‘నారాసుర రక్తచరిత్ర’’ అంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి ప్రయోజనం పొందారు.
జగన్కు ఎదురుతన్నిన వివేకా హత్య కేసు
2019 ఎన్నికల్లో ‘‘నారాసుర రక్తచరిత్ర’’ అంటూ తెదేపాపై దుష్ప్రచారం
బాబాయ్ని చంపిందెవరో గత ఐదేళ్లలో వెలుగులోకి...
అయినా, అవినాష్రెడ్డిని కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డిన జగన్
పైగా సొంత చెల్లెళ్లపైనే నిందలు
ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పిన జనం
ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వివేకా హత్య... రెండు ఎన్నికలపై ప్రభావం చూపించింది. 2019 ఎన్నికల సమయంలో హత్య జరగడంతో జగన్... ఈ నేరాన్ని అప్పటి అధికార పక్షమైన తెదేపాపైకి నెట్టేసి ‘‘నారాసుర రక్తచరిత్ర’’ అంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి ప్రయోజనం పొందారు. గత ఐదేళ్లలో... ఈ హత్య ఇంటి దొంగల పనేనని వెల్లడవ్వటం, హంతకుల్ని కాపాడుతున్నది జగనేనని తేలడం, సొంత చెల్లెళ్లే జగన్ తీరును ఎండగడుతూ ఊరూవాడా ప్రచారం చేయడం, ఈ కేసును అడ్డం పెట్టుకుని గత ఎన్నికల సమయంలో ఆయన నడిపిన కుట్ర, కుతంత్రం బహిర్గతం కావడంతో ఈ ఎన్నికల్లో జనం గుణపాఠం చెప్పారు.
సొంత బాబాయి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా...
కడప ఎంపీ అవినాష్రెడ్డే ఈ హత్యకు ప్రధాన కుట్రదారని సీబీఐ తేలిస్తే... ఆయన్ని రక్షించేందుకు జగన్ సర్వశక్తులూ ఒడ్డారు. దివంగతుడైన తన సొంత బాబాయి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా జగన్, ఆయన అనుచరగణం ప్రచారం చేయడాన్ని చూసి జనాలు నివ్వెరపోయారు. తన తండ్రి హంతకుల్ని చట్టం ముందు నిలబెట్టేందుకు ఒంటరి పోరాటం చేస్తున్న సునీతకు అండగా నిలవాల్సింది పోయి ఆమెను, ఆమె భర్తను అనుమానించేలా మాట్లాడటం, ఆస్తి కోసం వారే ఈ హత్య చేయించారంటూ దుష్ప్రచారం చేయటాన్ని అసహ్యించుకున్నారు. సునీతకు మద్దతుగా నిలిచిన వై.ఎస్.షర్మిలను సొంత చెల్లెలని చూడకుండా ‘‘పసుపు చీర కట్టుకుని మోకరిల్లారు’’ అంటూ జగన్ మాట్లాడటాన్ని జనం ఈసడించుకున్నారు. అదును చూసి దెబ్బేశారు.
ప్రతిపక్షంలో ఒకలా... సీఎం హోదాలో మరోలా...
ఈ కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించొద్దని, రాజకీయ పార్టీలు ఈ హత్య గురించి మాట్లాడొద్దని అప్పట్లో హైకోర్టు నుంచి జగన్ గ్యాగ్ ఆర్డర్ పొందారు. దీంతో 2019 ఎన్నికలప్పుడు అసలు వాస్తవాలు బయటకు రాలేదు. ఆయన గెలిచి అధికారం చేపట్టాక... అసలు స్వరూపం బయటపెట్టుకున్నారు. సునీత, షర్మిలలు అదే విషయాల్ని వెల్లడిస్తుంటే... ఈ హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడొద్దంటూ కడప కోర్టు ద్వారా మరోసారి గ్యాగ్ ఆర్డర్ పొందారు. జగన్ అమలు చేసిన ఈ ఎత్తుగడలేవీ ఫలించలేదు సరికదా ఎదురుతన్నాయి. ప్రతిపక్షంలో ఉండగా ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరిన జగన్... సీఎం అయ్యాక సీబీఐ విచారణ అవసరం లేదని తేల్చేశారు. రాష్ట్ర పోలీసులతో అంతకుముందు ఏర్పాటు చేసిన సిట్ను మార్చేశారు. ఫలానా వ్యక్తులపై తనకు అనుమానం ఉందని సునీత జాబితా రాసిస్తే... బాధితురాలైన ఆమె, ఆమె భర్తపైనే అనుమానం వ్యక్తంచేస్తూ మాట్లాడటం, ఆ తర్వాత నుంచి ఆమెను కలిసేందుకూ నిరాకరించటం వంటి పరిణామాల్ని గమనించిన జనం ఓటు ద్వారా వేటేశారు.
ఏకంగా సీబీఐనే వేధించారు...
కేసు దర్యాప్తులో సీబీఐ ఒక్కో తీగను లాగుతూ వస్తున్నకొద్దీ ఆ సంస్థను అనేక రకాలుగా వేధించటం, ఏకంగా దర్యాప్తు అధికారి రామ్సింగ్పైనే కేసు పెట్టటం వంటివి జగేన్ నైజాన్ని కళ్లకు కట్టాయి. అవినాష్రెడ్డిని సీబీఐ అనుమానితుడిగా గుర్తించగానే ఒక కన్ను మరో కంటిని పొడుచుకుంటుందా? అంటూ ఆయనకు క్లీన్చిట్ ఇస్తూ, దర్యాప్తును ప్రభావితం చేసేలా జగన్ అసెంబ్లీలో మాట్లాడటం, ఆయన కోటరీలో అత్యంత కీలకవ్యక్తి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్మీట్లు పెట్టి మరీ సీబీఐపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, అవినాష్రెడ్డిని సమర్థించుకుని రావడంతో వారి స్వభావం జనాలకు మరింతగా అర్థమైంది. అవినాష్ నిందితుడని తేలాక పదేపదే న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయిస్తూ న్యాయపరమైన చిక్కులు కల్పించారు. వాటిని దాటుకుని ఆయన్ని అరెస్టు చేయడానికి సీబీఐ అధికారులు కర్నూలు వెళ్లగా... జగన్ ప్రభుత్వం వారికి సహాయ నిరాకరణ చేసి ముప్పుతిప్పలు పెట్టింది. అవినాష్ ఉన్న ఆసుపత్రి ప్రాంగణం దరిదాపుల్లోకి కూడా సీబీఐ అధికారులను రానీయకుండా వైకాపా కార్యకర్తలు రోజుల తరబడి మోహరించి దౌర్జన్యం చేస్తుంటే ఖాళీ చేయించలేదు సరికదా.. ప్రభుత్వమే వారికి బందోబస్తు కల్పించడం వంటివి ప్రభావం చూపి... జగన్ ఓటమికి కారణమయ్యాయి.
ప్రజాకోర్టులో శిక్షిద్దామంటూ విస్తృత ప్రచారం
హంతకులకు ఓటేయొద్దని, వారిని కాపాడుతున్న తమ అన్నకు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం ఇవ్వొద్దని వివేకా కుమార్తె సునీత, జగన్ సోదరి షర్మిల విస్తృతంగా ప్రచారం చేశారు. ‘‘వివేకా హంతకుల్ని రక్షిస్తున్న జగన్ను ప్రజాకోర్టులో శిక్షిద్దాం. వైకాపా పునాదులు రక్తంతో తడిసిపోయాయి. వివేకాను చంపిన వాళ్లకు ఓటు ద్వారా బుద్ధి చెబుదాం. గత ఎన్నికల సమయంలో జగన్ నన్ను తోలుబొమ్మలా ఆడించారు. అప్పట్లో ఆయన్ను అంత గుడ్డిగా నమ్మా. ఇప్పుడు వాస్తవాలు గ్రహించి నేను చేసిన తప్పు సరిదిద్దుకుంటున్నా’’ అంటూ సునీత చెప్పిన మాటలు జనాలపై బాగా ప్రభావం చూపించాయి. ‘‘హూ కిల్డ్ బాబాయ్? గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిందెవరు?’’ అంటూ ప్రతిపక్ష పార్టీలు సంధించిన ప్రశ్నలూ ఆలోచన రేకెత్తించాయి. సీబీఐ అభియోగపత్రంలోని అంశాల ఆధారంగా రూపొందిన ‘‘వివేకం’’ చిత్రం ఈ హత్య జరిగిన తీరును, సూత్రధారులు, పాత్రధారులను జనంలోకి తీసుకెళ్లింది. దాంతో సొంత కుటుంబ సభ్యుల్నే మట్టుబెట్టిన వారు పాలకులుగా ఉండకూడదనే నిర్ణయానికి వచ్చిన ప్రజలు జగన్పై వేటేశారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి