Lok Sabha Elections: ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్‌డౌన్‌ షురూ..: ప్రధాని మోదీ

లోక్‌సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్‌ అనంతరం ‘ఇండియా’ కూటమి ఓటమి ఖాయమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Published : 20 May 2024 20:46 IST

కోల్‌కతా: ఇండియా కూటమి (INDIA Bloc) విచ్ఛిన్నానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. అయిదో విడత పోలింగ్‌ అనంతరం ఆ కూటమి ఓటమి ఖాయమైందన్నారు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని ఝాడ్‌గ్రామ్‌లో నిర్వహించిన ప్రచార సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ (Congress), టీఎంసీ (TMC)లు మునుగుతోన్న పడవలని ఎద్దేవా చేశారు. ప్రపంచ దేశాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న సమయంలో.. కుంభకోణాల రికార్డులు సృష్టించడంలో కాంగ్రెస్ నిమగ్నమైందని విమర్శించారు.

ఆ భాండాగారం తాళం చెవులు ఎక్కడ..? ప్రశ్నించిన మోదీ

హస్తం పార్టీ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించిన మోదీ.. ఓటుబ్యాంకు వర్గాల కోసం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను లాక్కోవాలని చూస్తోందన్నారు. జూన్‌ 4న ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్ష కూటమి తన   ఉనికి కోల్పోతుందని చెప్పారు. జల్‌పాయిగుడీలోని రామకృష్ణ మిషన్‌ ఆశ్రమంపై జరిగిన దాడిని ఖండిస్తూ.. టీఎంసీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. సీఎం మమతా బెనర్జీ స్వయంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనంతరం మోదీ తమ్లుక్‌లో ప్రచార సభకు వెళ్లాల్సింది. కానీ, ప్రతికూల వాతావరణంతో హెలికాప్టర్ ల్యాండింగ్‌లో సమస్య కారణంగా ఝాడ్‌గ్రామ్‌ నుంచే వర్చువల్‌గా ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని