CPI Ramakrishna: ఉద్యోగులకు తక్షణమే బకాయిలు చెల్లించండి: సీపీఐ రామకృష్ణ

ఏపీ సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Published : 22 Oct 2023 09:56 IST

అమరావతి: ఏపీ సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

‘‘రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది ఉపాధ్యాయులకు దాదాపు రూ.800 కోట్లు జగన్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు 2022 జులై నుంచి ఇవ్వాల్సిన డీఏను 2024లో మూడు విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పటం దుర్మార్గం. తమ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. సీపీఎస్‌ రద్దు విషయంలో కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది’’ అని రామకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని