Chandrababu-DK Sivakumar: తెదేపా అధినేత చంద్రబాబుతో డీకే శివకుమార్‌ మాటామంతీ..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు గురువారం బెంగళూరు విమానాశ్రయంలో పరస్పరం ఎదురయ్యారు.

Updated : 28 Dec 2023 21:01 IST

బెంగళూరు: తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu), కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Sivakumar)లు గురువారం బెంగళూరు విమానాశ్రయంలో పరస్పరం ఎదురుపడ్డారు. కుప్పం వెళ్లేందుకు చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లగా.. అదే సమయంలో కాంగ్రెస్‌ ఆవిర్భావ సభ కోసం నాగ్‌పుర్‌ వెళ్లేందుకు డీకే శివకుమార్‌ విమానాశ్రయానికి వచ్చారు. రెండు విమానాలు పక్కపక్కనే ఉండి.. పరస్పరం ఎదురుకావడంతో ఇద్దరు నేతలు మర్యాదపూర్వకంగా కరచాలనం చేసుకున్నారు. డీకే శివకుమార్‌.. చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి కాసేపు ముచ్చటించారు. ఇద్దరు నేతలు మర్యాదపూర్వకంగానే కలిశారని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని