YSRCP: వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం

గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. 

Updated : 19 Apr 2024 04:54 IST

అమరావతి: గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. పొన్నూరు మండలం ములుకుదురులో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అంబటి మురళీ పంపిణీ చేశారు. దీనిపై తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వంశీకృష్ణ.. సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు వైకాపా అభ్యర్థి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినట్టు నిర్ధరించారు. దీంతో అంబటి మురళీపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని